యాప్నగరం

వెస్టిండీస్ లాహోర్ పర్యటన వాయిదా

భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌ పర్యటనకి తాము వెళ్లబోమని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు ఆ దేశ క్రికెట్

TNN 9 Nov 2017, 2:40 pm
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌ పర్యటనకి తాము వెళ్లబోమని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు ఆ దేశ క్రికెట్ బోర్డుకి తేల్చి చెప్పేశారు. దీంతో.. త్వరలో ఈ రెండు జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెస్టిండీస్ ప్రకటించింది. గత నెలలో శ్రీలంక జట్టు లాహోర్‌ వేదికగా ఒక టీ20 మ్యాచ్ ఆడిన నేపథ్యంలో ఇకపై అన్ని అగ్రశ్రేణి జట్లు పాక్‌లో పర్యటిస్తాయని ఆశించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి తాజాగా విండీస్ నిర్ణయంతో చుక్కెదురైంది.
Samayam Telugu west indies t20i series against pakistan in lahore postponed
వెస్టిండీస్ లాహోర్ పర్యటన వాయిదా


2009లో శ్రీలంక క్రికెటర్లు లాహోర్‌ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు బస్సులో వెళ్తుండగా వారిపై ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి జట్టు కూడా ఆ దేశంలో పర్యటించే సాహసం చేయడం లేదు. ఐసీసీతో పాటు వెస్టిండీస్ ఏర్పాటు చేసిన భద్రతా కమిటీ కూడా.. లాహోర్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ.. జట్టులోని సీనియర్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పాక్‌ పర్యటనని నిరాకరించడంతో విండీస్ వెనక్కి తగ్గక తప్పలేదు. వచ్చే ఏడాది ఈ సిరీస్‌ని నిర్వహిస్తామని పాక్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.