యాప్నగరం

వెస్టిండీస్‌‌కి ప్రత్యామ్నాయ మార్గం లేదు: కోహ్లి

రెండు టెస్టుల ఈ సిరీస్‌లో 0-1తో వెనకబడిన వెస్టిండీస్ జట్టు‌కి గెలవడం తప్ప మరో మార్గం లేదు--కోహ్లి

Samayam Telugu 11 Oct 2018, 3:51 pm
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా శుక్రవారం నుంచి జరగనున్న రెండో టెస్టులో పుంజుకోవడం తప్ప సిరీస్‌లో వెస్టిండీస్‌కి మరో దారి లేదని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో 0-1తో వెనకబడిన వెస్టిండీస్ జట్టు‌కి గెలవడం తప్ప మరో మార్గం ఇప్పుడు లేదని కోహ్లి వివరించాడు.
Samayam Telugu DoqSiooXkAEEDz6


రెండో టెస్టు నేపథ్యంలో ఈరోజు మీడియాతో కోహ్లి మాట్లాడుతూ ‘భారత్ జట్టుని ప్రతిఘటిస్తూ.. రేపు టెస్టులో వారు పుంజుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇది రెండు టెస్టుల సిరీస్ కావడంతో.. వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. హైదరాబాద్‌ సమతుల్య వాతావరణం కారణంగా.. పిచ్‌ చాలా బాగుంటుంది. బాగా బౌలింగ్ చేస్తే వికెట్లు తీయోచ్చు.. బ్యాటింగ్‌లోనూ భారీగా పరుగులు సాధించొచ్చు’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.