యాప్నగరం

జడేజా ముఖంపై ఒక్కటిద్దామనుకున్నా: రోహిత్

జడేజా మీద వచ్చిన కోపానికి అతణ్ని అక్కడే వదిలేసి వెళ్దామని అనిపించింది. అతడి వైపు సీరియస్‌గా చూశాను. లాగి పెట్టి ఒక్కటి ఇద్దామనుకున్నా - రోహిత్ శర్మ.

Samayam Telugu 5 Jun 2018, 6:17 pm
దభారత క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా మంచి మిత్రులనే సంగతి తెలిసిందే. టీమిండియా ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన సమయంలో జడ్డూ రహానే, రోహిత్‌లకు కోపం తెప్పించాడట. మ్యాచ్ లేని సమయంలో వీరు ముగ్గురు తమ భార్యలతో కలిసి సఫారీకి వెళ్లారు. నడుస్తుంటే వీరికి చిరుతలు కనిపించాయి. దీంతో అందరూ కదలకుండా నిలబడిపోయారు.
Samayam Telugu jaddu rohit


కానీ రవీంద్ర జడేజా మాత్రం వాటిని పిలుస్తూ.. శబ్దాలు చేశాడు. మనోడి చేష్టలకు అవి వెనక్కి తిరిగి చూశాయి. దీంతో మిగతా ఇద్దరికీ కోపం వచ్చిందట. జడ్డూతో కలిసి ఇంకెప్పుడూ బయటకు రావొద్దని అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చామని ఇటీవలి ఓ షో సందర్భంగా రహానే చెప్పాడు. మనం అడవిలో ఉన్నాం నువ్వే చేస్తున్నావో అర్థం అవుతుందా, తేడా వస్తే చిరుతలకు ఆహారం అవుతామని జడ్డూపై కోప్పడ్డామని రోహిత్ చెప్పాడు.

‘జడేజా మీద వచ్చిన కోపానికి అతణ్ని అక్కడే వదిలేసి వెళ్దామని అనిపించింది. అతడి వైపు సీరియస్‌గా చూశాను. ముఖం మీద లాగి పెట్టి ఒక్కటి ఇద్దామనుకున్నా. కానీ కామ్‌గా ఉండటమే మంచిదని ఏం చేయలేద’ని రోహిత్ చెప్పాడు. అప్పుడు వచ్చిన కోపానికి జడ్డూతో ఇంకెప్పుడూ ఎక్కడికీ వెళ్లొద్దని అనుకున్నాం. కానీ మాకు అదో మంచి అనుభవమని రోహిత్, రహానే చెప్పారు. గతంలో గుజరాత్‌లో గిర్ సింహాలతో జడేజా ఫొటోలు, సెల్ఫీలు దిగడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Marking territory 🐆#cheetah #animalkingdom #rajputboy A post shared by Ravindrasinh Jadeja (@royalnavghan) on Jan 21, 2018 at 3:09am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.