Virat Kohliని ఉరుకులు పెట్టించిన ధోనీ.. ఆఖరికి కోహ్లీ మోకాళ్లపై
మైదానంలో వికెట్ల మధ్య విరాట్ కోహ్లీ గంటకి సగటున 25కిమీ వేగంతో పరుగెత్తతాడు. కానీ.. నాన్స్ట్రైక్ ఎండ్లో ధోనీ ఉంటే.. ఆ వేగం మరింత పెంచాల్సి వచ్చిందట .
Samayam Telugu 11 Jun 2021, 9:25 am
ప్రధానాంశాలు:
- ధోనీతో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేకపోయిన కోహ్లీ
- ఫిట్నెస్ టెస్టు తరహాలో తనని పరుగెత్తించాడని కితాబు
- ఆ మ్యాచ్లో భారత్ జట్టుని గెలిపించిన విరాట్ కోహ్లీ
- మ్యాచ్ ముగిసిన తర్వాత మోకాళ్లపై కూర్చుండిపోయిన విరాట్
మైదానంలో వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తిరుగులేదు. భారత జట్టులో ఫిట్నెస్ స్థాయిని పెంచిన విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో మహేంద్రసింగ్ ధోనీతో పాటు వికెట్ల మధ్య పరుగెత్తలేక అలసిపోయాడు. ఆస్ట్రేలియాతో 2016 టీ20 వరల్డ్కప్లో భాగంగా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా ఆఖరికి 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గత ఏడాది కూడా ఆ మ్యాచ్ని, ధోనీతో పరుగుని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకోవడం విశేషం. మొహాలి వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్.. ఓపెనర్ అరోన్ ఫించ్ (43: 34 బంతుల్లో 3x4, 2x6), గ్లెన్ మాక్స్వెల్ (31: 28 బంతుల్లో 1x4, 1x6) నిలకడగా ఆడటంతో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ (12), శిఖర్ ధావన్ (13) నిరాశపరిచినా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ (82 నాటౌట్: 51 బంతుల్లో 9x4, 2x6).. చివర్లో మహేంద్రసింగ్ ధోనీ (18 నాటౌట్: 10 బంతుల్లో 3x4)తో కలిసి 19.1 ఓవర్లలో 161/4తో టీమిండియాని గెలిపించాడు.
మ్యాచ్లో ఐదో వికెట్కి అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధోనీ- కోహ్లీ.. వికెట్ల మధ్య స్ప్రింటర్ తరహాలో పరుగెత్తారు. మరీ ముఖ్యంగా.. ధోనీ సింగిల్ వచ్చే చోట డబుల్ కోసం కోహ్లీని తరచూ పిలుస్తూ కనిపించాడు. దాంతో.. ఆస్ట్రేలియా ఫీల్డర్లపైనా ఒత్తిడి కనిపించింది. ధోనీ వేగంగా సింగిల్ పూర్తి చేసుకుని డబుల్కి పిలవడంతో.. కోహ్లీ కూడా మరింత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తాల్సి వచ్చింది.
వికెట్ల మధ్య విరాట్ కోహ్లీ గంటకి సగటున 25కిమీ వేగంతో పరుగెత్తతాడు. కానీ.. ధోనీ నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్నప్పుడు ఆ వేగం మరింత పెంచాల్సి వచ్చేది. ఆ మ్యాచ్పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ‘‘ఆ మ్యాచ్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఫిట్నెస్ టెస్టులో పరుగెత్తినట్లు నన్ను ధోనీ పరుగులు పెట్టించాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కోహ్లీ మోకాళ్లపై కూర్చుండిపోయాడు.
మ్యాచ్లో ఐదో వికెట్కి అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధోనీ- కోహ్లీ.. వికెట్ల మధ్య స్ప్రింటర్ తరహాలో పరుగెత్తారు. మరీ ముఖ్యంగా.. ధోనీ సింగిల్ వచ్చే చోట డబుల్ కోసం కోహ్లీని తరచూ పిలుస్తూ కనిపించాడు. దాంతో.. ఆస్ట్రేలియా ఫీల్డర్లపైనా ఒత్తిడి కనిపించింది. ధోనీ వేగంగా సింగిల్ పూర్తి చేసుకుని డబుల్కి పిలవడంతో.. కోహ్లీ కూడా మరింత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తాల్సి వచ్చింది.
వికెట్ల మధ్య విరాట్ కోహ్లీ గంటకి సగటున 25కిమీ వేగంతో పరుగెత్తతాడు. కానీ.. ధోనీ నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్నప్పుడు ఆ వేగం మరింత పెంచాల్సి వచ్చేది. ఆ మ్యాచ్పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ‘‘ఆ మ్యాచ్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఫిట్నెస్ టెస్టులో పరుగెత్తినట్లు నన్ను ధోనీ పరుగులు పెట్టించాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కోహ్లీ మోకాళ్లపై కూర్చుండిపోయాడు.