యాప్నగరం

రోహిత్ నేరుగా ఆస్ట్రేలియా వెళ్లకపోవడానికి కారణమిదే.. నాన్న కోసం స్వదేశానికి!

IPL 2020 ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మిగతా ఆటగాళ్లతో కలిసి రోహిత్ శర్మ దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లి ఉండుంటే టెస్టు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండుండే వాడు. కానీ అతడు ఇండియాకు తిరిగొచ్చాడు.

Samayam Telugu 25 Nov 2020, 2:38 pm
ఐపీఎల్ ముగియగానే భారత క్రికెటర్లంతా దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లగా.. రోహిత్ శర్మ మాత్రం ఇండియా తిరిగొచ్చాడు. గాయపడిన రోహిత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. రోహిత్ ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో.. అతడు ఆస్ట్రేలియా వెళ్లేది అనుమానంగా మారింది. డిసెంబర్ 11న మరోసారి అతడి ఫిట్‌నెస్‌ను సమీక్షించనున్నారు. కానీ ఆస్ట్రేలియా వెళ్లాక మరో 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది.
Samayam Telugu Rohit Sharma and his father
Image: Instagram


రోహిత్ శర్మ నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి ఉంటే.. అక్కడే టీమిండియా ఫిజియో సమక్షంలో ట్రైనింగ్ తీసుకొని ఉండుంటే.. టెస్టు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండేవాడు. కానీ అతడు భారత్ తిరిగొచ్చేయడంతో టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకున్నాడు.

రోహిత్‌ను తాము ఎన్‌సీఏకు వెళ్లమని చెప్పలేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. దీన్ని బట్టి హిట్ మ్యానే ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ వచ్చాడని అర్థం అవుతోంది. రోహిత్ ఇలా చేయడానికి కారణం ఉందని తెలుస్తోంది. రోహిత్ స్వదేశానికి తిరిగి రావడానికి గాయం లేదా మరో కమిట్‌మెంట్ ఏదీ కారణం కాదు. రోహిత్ తండ్రికి కరోనా సోకిందని.. అందుకే అతడు భారత్ తిరిగొచ్చాడని క్రికెట్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ తెలిపారు.

టెస్టు సిరీస్ ఆడే ఉద్దేశం రోహిత్‌కు లేకపోతే బెంగళూరు వెళ్లి ఎన్‌సీఏలో శిక్షణ పొందేవాడు కాదు. కుటుంబంతో కలిసి ముంబైలోనే గడిపేవాడని మజుందార్ తెలిపారు. ఎన్‌సీఏలో ఉన్న రోహిత్, ఇషాంత్ శర్మ కోసం క్వారంటైన్ నిబంధనలను సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.