యాప్నగరం

భారత క్రికెటర్లకి కూడా రెస్ట్ కావాలి..!

భారత క్రికెటర్లకి బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం రెస్ట్ ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో

TNN 21 Oct 2017, 8:20 pm
భారత క్రికెటర్లకి బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం రెస్ట్ ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యర్థించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, అనంతరం ఇంగ్లాండ్‌తో కీలక సిరీస్‌లు ఉండటంతో కనీసం రాబోవు సిరీస్‌ల్లోనైనా కొంతమంది క్రికెటర్లకి విశ్రాంతినివ్వాలని కెప్టెన్ సూచించాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన భారత్.. తర్వాత వరుసగా వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో వరుసగా సిరీస్‌లు ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కి సిద్ధమైంది. ఆదివారం వాంఖడే వేదికగా తొలి వన్డే ఆరంభంకానుంది. 2018, జనవరిలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్ అక్కడ మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
Samayam Telugu will give rest to key players ahead of overseas tours says virat kohli
భారత క్రికెటర్లకి కూడా రెస్ట్ కావాలి..!


‘ఈ బిజీ షెడ్యూల్ గురించి ఇప్పటికే బీసీసీఐతో మేము మాట్లాడాం. నా అంచనా ప్రకారం త్వరలోనే క్రికెటర్లందరితో కూర్చుని దీని గురించి బోర్డు చర్చించవచ్చు. ఉదాహరణకి.. భారత్‌తో సిరీస్ ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్‌నే చూడండి. ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. జట్టులో పునరుత్తేజం పెంపొందించేందుకు ఆటగాళ్లకి అలాంటి విశ్రాంతి అవసరం. టెస్టు సిరీస్‌లు ఉండటంతో భారత్ జట్టులోని ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్, షమీలకి ఇప్పటికే రెస్ట్ ఇచ్చాం. బౌలర్లకే కాదు.. జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి కూడా కీలక పర్యటనల నేపథ్యంలో కొంచెమైనా విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో ఉన్నాం’ అని కోహ్లి వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.