యాప్నగరం

వాంఖడేలో భారత్‌ని ఓడిస్తాం: కివీస్ కెప్టెన్

భారత్ జట్టుని సొంతగడ్డపై ఓడించాలంటే చాలా కష్టమని.. అయినప్పటికీ శాయశక్తులా ప్రయత్నిస్తామని న్యూజిలాండ్ కెప్టెన్

TNN 21 Oct 2017, 4:41 pm
భారత్ జట్టుని సొంతగడ్డపై ఓడించాలంటే చాలా కష్టమని.. అయినప్పటికీ శాయశక్తులా ప్రయత్నిస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో విలియమ్సన్ మాట్లాడాడు. ఇటీవల భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో గెలిచిన న్యూజిలాండ్ ప్రస్తుతం ఉత్సాహంగా కోహ్లిసేనతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది.
Samayam Telugu will have to play our best cricket to beat india says williamson
వాంఖడేలో భారత్‌ని ఓడిస్తాం: కివీస్ కెప్టెన్


‘భారత్‌కి సొంతగడ్డపై మెరుగైన రికార్డు ఉంది. అలాంటి జట్టుని ఓడిచాలంటే చాలా కష్టం. ముఖ్యంగా.. వారికి కలిసొచ్చే మైదానాల్లో. ప్రస్తుతం ప్రపంచంలోనే బలమైన జట్టుగా టీమిండియా రూపాంతరం చెందింది. కాబట్టి.. కోహ్లిసేనని ఓడించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయడం తప్ప కివీస్‌కి మరో దారిలేదు. గత పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌‌లో గట్టి పోటీనిచ్చాం. కానీ.. విశాఖపట్నంలో జరిగిన విజేత నిర్ణయాత్మక.. చివరి వన్డేలో మరీ తీసికట్టు ప్రదర్శనతో నిరాశపరిచాం. దీంతో సిరీస్‌ని 2-3తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సిరీస్‌లో కూడా భారత్‌ని ఎదుర్కోవడం కఠిన సవాలని మాకు తెలుసు. కానీ.. వాంఖడే నుంచే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.