యాప్నగరం

టెస్టు‌లో పాస్ అయితేనే.. కోహ్లికి ఛాన్స్

జట్టులో నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు. అందరికీ ఏ నియమ నిబంధనలు వర్తిస్తాయో నాకు అవే అమలవుతాయి.

TNN 24 Mar 2017, 2:31 pm
టీమిండియాలో ఆటగాళ్లందరూ సమానమే.. గాయపడిన తర్వాత ఫిటెనెస్ నిరూపించుకున్నాకే తిరిగి జట్టు తరఫున మ్యాచ్ ఆడాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. రాంచీ టెస్టులో తొలిరోజు ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విరాట్ కోహ్లి నొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు కోహ్లి బ్యాటింగ్‌కి వచ్చినా తక్కువ స్కోరుకే ఔటైపోయాడు. గాయంతో టెస్టు ముగిసే వరకు మైదానంలో ఇబ్బందిగానే కదిలిన కోహ్లి.. శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభంకానున్న ధర్మశాల టెస్టులో ఆడట్లేదని వార్తలొచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆగమేఘాల మీద ధర్మశాలకి పిలిపించింది.
Samayam Telugu will play in dharamsala only if i pass fitness test virat kohli
టెస్టు‌లో పాస్ అయితేనే.. కోహ్లికి ఛాన్స్


నాలుగో టెస్టు నేపథ్యంలో విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఫిటెనెస్ టెస్టులో నేను పాస్ అయితేనే ధర్మశాల మ్యాచ్‌లో మైదానంలోకి దిగుతా. నిర్ణయం ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి వచ్చేస్తుంది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే.. జట్టులో నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు. అందరికీ ఏ నియమ నిబంధనలు వర్తిస్తాయో నాకు అవే అమలవుతాయి. నేను 100 శాతం ఫిట్‌గా ఉన్నప్పుడే బరిలోకి దిగుతా’ అని కెప్టెన్ స్పష్టం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ధర్మశాల టెస్టులో గెలిచిన జట్టు విజేతగా నిలవనుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.