యాప్నగరం

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్.. భారత్ టార్గెట్ 185

తొలిసారి ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆడుతున్న భారత్ జట్టుకి భారీ టార్గెట్‌ని ఆస్ట్రేలియా నిర్దేశించింది. భారత బౌలింగ్‌ని ఉతికారేసిన ఆసీస్ ఓపెనర్లు.. ఆఖరి వరకూ కోలుకోనివ్వలేదు.

Samayam Telugu 8 Mar 2020, 2:14 pm
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కి కఠిన సవాల్ ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు హేలీ (75: 39 బంతుల్లో 7x4, 5x6), మూనీ (78 నాటౌట్: 54 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీలు సాధించగా.. భారత బౌలర్లు తేలిపోయారు.
Samayam Telugu Australia India Cricket Womens T20 World Cup


ఇప్పటి వరకూ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ జరగగా.. అన్నిసార్లూ ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా జట్టు ఈరోజు టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఓవర్‌ నుంచే వ్యూహాత్మంగా ఆడిన ఆసీస్ ఓపెనర్లు.. మొదటి 10 ఓవర్లలో భారత బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా.. హేలీ భారీ షాట్లు ఆడేసింది. భారత అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న శిఖ పాండే బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన హేలీ.. స్కోరు బోర్డుని ఉరకలెత్తించింది.

జట్టు స్కోరు 115 వద్ద హేలీ ఔటవగా.. ఆ తర్వాత బ్యాట్ ఝళిపించిన మూనీ ఆఖర్లో గేర్ మార్చి ఎడాపెడా బౌండరీలు సాధించింది. మధ్యలో కెప్టెన్ లానింగ్ (16), గార్డనెర్ (2), హైన్స్ (4) వికెట్లని భారత్ పడగొట్టినా.. అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోరుకి దగ్గరైపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. పూనమ్ యాదవ్, రాధ యాదవ్ చెరొక వికెట్ తీశారు. భారత మహిళల క్రికెట్ జట్టుకి ఇదే తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.