యాప్నగరం

ట్రంప్ రాక‌.. జ‌న‌సంద్ర‌మైన మొతెరా స్టేడియం

గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియం.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సంద‌ర్భంగా జ‌న‌సంద్ర‌మైంది. ఈ స్టేడియంలో ఒకేసారి ల‌క్షా ప‌ది వేల మంది కూర్చుని మ్యాచ్‌ను తిలికించే అవ‌కాశ‌ముంది.

Samayam Telugu 24 Feb 2020, 2:07 pm
భార‌త క్రికెట్ అభిమానులకు శుభ‌వార్త. ప్ర‌పంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం రికార్డు భార‌త్ సొంత‌మ‌వ‌బోతోంది. సోమ‌వారం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. గుజ‌రాత్‌లోని మొతెరా స్టేడియాన్ని ప్రారంభించ‌బోతున్నారు. దీని సీటింగ్ కెపాసిటీ ల‌క్షా ప‌ది వేలు కావ‌డం విశేషం. ట్రంప్ రాక సంద‌ర్భంగా ఈ స్టేడియం అంతా జ‌నంతో కిక్కిరిసిపోయింది. అనేక రంగాల‌కు చెందిన సెలెబ్రిటీలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో క‌లిసి ట్రంప్ ఈ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. గుజ‌రాత్‌లో అతిపెద్ద న‌గ‌ర‌మైన అహ్మ‌దాబాద్‌లో ఈ స్టేడియంలో నిర్మించారు. నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం ఈ స్టేడియంలో జరగుతోంది.
Samayam Telugu Ahmedabad: Folk artists perform as Prime Minister Narendra Modi welcomes US Pres...
Prime Minister Narendra Modi ,US President Donald Trump, First Lady Melania Trump


Read Also: పృథ్వీ షాపై ఫ్యాన్స్ ఫైర్ .. షా స్థానంలో ఆ ప్లేయర్‌ను ఆడించండి

నిజానికి పాత‌ మొతెరా స్టేడయంను స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియంగా కూడా పిలుస్తారు. ఇది భారత్‌లోకెల్లా పురాతన స్టేడియాల్లో ఒకటి. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచన గుజరాత్ క్రికెట్ సంఘం పెద్దలకు వచ్చింది. ఈక్రమంలోనే ఐదేళ్ల కిందట మొతెరా స్టేడియాన్ని కూలగొట్టి కొత్తగా దీన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతిపెద్ద స్టేడియం రికార్డు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ స్టేడియం పేరిట ఉంది. అక్కడ ఒకేసారి కూర్చుని లక్ష మందికిపైగా మ్యాచ్ వీక్షిస్తారు.నిజానికి ఈ స్టేడియాన్ని ఈ ఏడాది మార్చిలో ఆసియా వర్సెస్ వరల్డ్ లెవన్ జట్ల మధ్య నిర్వహించే మ్యాచ్ ద్వారా ప్రారంభిద్దామని అనుకున్నారు. అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

Read Also: కోహ్లీ మ‌ళ్లీ బౌల్ట్‌కే దొరికిపోయావా..? అభిమానులు సెటైర్లు

మ‌రోవైపు ఈ స్టేడియాన్ని అత్యంత అధునాతంగా నిర్మించారు. వ‌ర‌ల్డ్ క్లాస్ ఫెసిలిటీల‌ను ఈ స్టేడియంలో క‌ల్పించారు. ఆధునిక డ్రెస్సింగ్‌రూంల‌తోపాటు ఆయా జ‌ట్లు స‌మావేశ‌మ‌వ్వ‌డానికి స‌రికొత్త హంగుల‌తో మీటింగ్ రూంల‌ను నిర్మించారు. తాజాగా ట్రంప్ ప్రారంభించ‌డంతో సోమ‌వారం నుంచి ఈ స్టేడియం అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.