యాప్నగరం

ప్రపంచకప్-2003 ఫైనల్ మళ్లీ జరిగితే..?

ఆ రోజు మ్యాచ్ తొలి ఓవర్ నుంచే మాకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని తప్పిదాలను మేమే నమ్మలేకపోయాం. ఆ ఫైనల్లో ఆడిన

TNN 23 May 2017, 9:25 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్- 2003 అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ (140: 121 బంతుల్లో 4x4, 8x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. ఛేదనలో ఒత్తిడికి తలొగ్గిన భారత్ 234 పరుగులకే కుప్పకూలిపోయింది. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ (82: 81 బంతుల్లో 10x4, 3x6), రాహుల్ ద్రవిడ్ (47) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారీ అంచనాల మధ్య ఓపెనర్‌గా వెళ్లిన సచిన్ తెందుల్కర్ (4) తొలి ఓవర్‌లోనే మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. కానీ.. అదే ఫైనల్ ఇప్పుడు జరిగితే ఛేదనలో ఆటగాళ్ల ధోరణి భిన్నంగా ఉంటుందని సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు.
Samayam Telugu would have approached the 2003 world cup differently if t20s existed then tendulkar
ప్రపంచకప్-2003 ఫైనల్ మళ్లీ జరిగితే..?


‘ఆ రోజు మ్యాచ్ తొలి ఓవర్ నుంచే మాకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని తప్పిదాలను మేమే నమ్మలేకపోయాం. ఆ ఫైనల్లో ఆడిన క్రికెటర్లతో మళ్లీ అదే మ్యాచ్‌ని ఇప్పుడు నిర్వహిస్తే.. భారీ లక్ష్యాన్ని ఛేదించే ధోరణి భిన్నంగా ఉంటుంది’ అని సచిన్ వివరించాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ వికెట్ కోల్పోగానే.. భారత్ ఒత్తిడిలో పడిపోయింది. ఒక ఎండ్‌లో సెహ్వాగ్ పోరాడుతున్నా.. గంగూలీ (24), మహ్మద్ కైఫ్ (0), యువరాజ్ సింగ్ (24) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. అప్పట్లో అది భారీ లక్ష్యమని.. కానీ ప్రస్తుతం టీ20 బాదుడికి అలవాటు పడ్డ క్రికెటర్లకి మాత్రం అది కంగారు పడే టార్గెట్ కాదని సచిన్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.