యాప్నగరం

Smriti Mandhana | పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కంటే డబుల్‌లో స్మృతి మంధనాకి డీల్.. నెటిజన్లు సెటైర్లు

Smriti Mandhana Price ఫ్రాంఛైజీ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ రూ.3.4 కోట్లకి స్మృతి మంధనాని వేలంలో కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ప్లేయర్ల జాబితాలో ఈ భారత ఓపెనర్ టాప్‌లో నిలవగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఫ్రాంఛైజీ క్రికెట్ ద్వారా ఏటా ఆర్జిస్తున్న ఆదాయం కేవలం రూ.1.23 కోట్లు మాత్రమే. దాంతో పాక్ అభిమానుల్ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Feb 2023, 5:44 pm

ప్రధానాంశాలు:

  • డబ్ల్యూపీఎల్‌ వేలంపై విమర్శలు గుప్పించిన పాక్
  • స్మృతి మంధనాకి ఎవరూ ఊహించని డీల్
  • రివర్స్‌లో సెటైర్స్ వేస్తున్న భారత్ అభిమానులు
  • బాబర్ అజామ్ కంటే డబుల్‌లో స్మృతికి డీల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Babar Azam, Smriti Mandhana
బాబర్ అజామ్, స్మృతి మంధనా
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధనా (Smriti Mandhana) రూ.3.4 కోట్ల ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా భారత్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా ఉన్న స్మృతి.. తన ఆటతోనే కాదు అందంతోనూ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. దాంతో ఆమె కోసం ఫ్రాంఛైజీలు వేలంలో గట్టిగానే పోటీపడ్డాయి. కానీ ముంబయి ఇండియన్స్‌ని వెనక్కి నెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్లకి స్మృతిని దక్కించుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లని ఆడించడం లేదు. దాంతో ఆ దేశ అభిమానులు ఈ లీగ్‌ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో భారత అభిమానులు గట్టిగా కౌంటరిచ్చారు. ఈ క్రమంలో ఐపీఎల్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌కి మధ్య వ్యత్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆదాయం, ఆదరణ విషయంలో కనీస పోటీని కూడా ఐపీఎల్‌కి పీఎస్‌ఎల్ ఇవ్వలేకపోతున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో పెషావర్ టీమ్‌కి ఆ దేశ కెప్టెన్ బాబర్ అజామ్ ఆడుతున్నాడు. ప్లాటినమ్ కేటగిరీలో ఉన్న బాబర్ అజామ్‌కి పెషావర్ ఫ్రాంఛైజీ ఒక్కో సీజన్‌కి చెల్లిస్తున్న మొత్తం (భారత కరెన్సీలో) రూ.1.23 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని తెరపైకి తెచ్చిన భారత అభిమానులు.. స్మృతి మంధనాకి డబ్ల్యూపీఎల్-2023 సీజన్‌కి ఆర్సీబీ రూ.3.4 కోట్లు ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు. దెబ్బకి పాక్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో పాక్ ప్లేయర్లని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆడించడం
లేదు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.