యాప్నగరం

భారత్‌ని ఓడించాలా.. అలా చేయండి..?

ఇంగ్లాండ్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలించేలా కనిపిస్తున్నాయి. టోర్నీలో 400 స్కోరైనా

TNN 29 May 2017, 5:29 pm
దాయాది దేశాల రసవత్తర క్రికెట్ పోరు సమీపిస్తున్న కొద్దీ పాక్ ఆటగాళ్ల నుంచి మాటల దాడి పెరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై మెరుగైన రికార్డు ఉన్న పాకిస్థాన్ జూన్ 4న జరిగే మ్యాచ్‌లో తప్పక గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ యూనిష్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు 10 సార్లు తలపడగా.. తొమ్మిదింట్లో భారత్ విజయం సాధించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు సార్లు ఈ రెండు జట్లు ఢీకొనగా.. పాక్ రెండింట్లో, భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది.
Samayam Telugu younis khan believes sarfraz ahmed led pakistan can beat india
భారత్‌ని ఓడించాలా.. అలా చేయండి..?


‘ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ని ఓడించే సత్తా పాకిస్థాన్‌కి ఉంది. ఇంగ్లాండ్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలించేలా కనిపిస్తున్నాయి. టోర్నీలో 400 స్కోరైనా సులువుగా ఛేదించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలంటే జట్టు ఫీల్డింగ్‌దే ప్రధాన పాత్ర. ఫీల్డింగ్ విషయంలో పాక్ శ్రద్ధ వహించి.. దొరికిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ జట్టును నడిపించే తీరును బట్టే పాక్ క్రికెట్ గమనం ఆధారపడి ఉంది’ అని యూనిష్ ఖాన్ వివరించాడు.

జూన్ 1న ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవనుండగా.. జూన్ 4న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. 2013లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో గెలిచిన భారత్ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.