ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్కి ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లని పక్కన పెట్టిన సెలక్టర్లు.. భవిష్యత్లో కూడా వారికి అవకాశాలిచ్చేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు.. శ్రీలంకతో సిరీస్ నుంచే ప్రపంచకప్ జట్టు వేట ప్రారంభమవుతుందని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలనే దానిపై మీడియాతో మాట్లాడాడు.
‘టాప్ ఆర్డర్ విఫలమైతే.. మిడిలార్డర్లో ధోనీతో పాటు ఒక సీనియర్ బ్యాట్స్మెన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. యువ క్రికెటర్లు అనుభవం సంపాదించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం యువరాజ్కి అవసరం లేకపోయినా.. విశ్రాంతినిచ్చారు. జట్టులో కొంత మందికి రాబోవు కఠిన సిరీస్ల దృష్ట్యా రెస్ట్ అవసరం. కానీ.. వారికి ఇవ్వలేదు. జట్టులో స్పెషలిస్ట్ వన్డే ఆటగాళ్లు అవసరం లేదా..? 2019 ప్రపంచకప్ జట్టు కోసం భారత్ ఇప్పటి నుంచే అతిగా ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు’ అని సెహ్వాగ్ సూచించాడు.
‘టాప్ ఆర్డర్ విఫలమైతే.. మిడిలార్డర్లో ధోనీతో పాటు ఒక సీనియర్ బ్యాట్స్మెన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. యువ క్రికెటర్లు అనుభవం సంపాదించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం యువరాజ్కి అవసరం లేకపోయినా.. విశ్రాంతినిచ్చారు. జట్టులో కొంత మందికి రాబోవు కఠిన సిరీస్ల దృష్ట్యా రెస్ట్ అవసరం. కానీ.. వారికి ఇవ్వలేదు. జట్టులో స్పెషలిస్ట్ వన్డే ఆటగాళ్లు అవసరం లేదా..? 2019 ప్రపంచకప్ జట్టు కోసం భారత్ ఇప్పటి నుంచే అతిగా ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు’ అని సెహ్వాగ్ సూచించాడు.