యాప్నగరం

పరువు దక్కించుకున్న ఆస్ట్రేలియా

వరుసగా రెండు ఓటములను చవిచూసిన కంగారూలు.. చివరి మ్యాచ్‌లో చెలరేగిపోయారు

TNN 22 Feb 2017, 7:10 pm
ఆస్ట్రేలియా సొంతగడ్డపై లంకేయుల చేతిలో టీ20 సిరీస్ కోల్పోయినా.. చివరి మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ వరకూ పోరాడి గెలిచిన లంకేయులు ముగింపు మ్యాచ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. 188 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక మరో 12 బంతులు మిగిలి ఉండగానే 146 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో సిరీస్‌ను లంకేయులు 2-1తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Samayam Telugu zampa faulkner help australia prevent t20i whitewash
పరువు దక్కించుకున్న ఆస్ట్రేలియా


తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు అరోన్ పించ్ (53), మిచెల్ క్లింగర్ (62) అర్ధ శతకాలు బాదడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగలిగింది. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంకను ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోలుకోలేని దెబ్బతీశాడు. దిల్షాన్ మునవేరా (37), మిలింద సిరివర్దనె (35) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు పేలవ ఆటతీరుతో నిరాశపరచడంతో లంక ఓటమి దిశగా సాగింది. గత మ్యాచ్‌లో ఒంటి చేత్తో శ్రీలంకను విజయతీరాలకు చేర్చిన గుణరత్నె (4)ను ఆడం జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగింది. చివరికి ఆ జట్టు కథ 146 పరుగుల వద్దే ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.