యాప్నగరం

శ్రీలంకకి మళ్లీ షాకిచ్చిన పసికూన..!

శ్రీలంకపై వన్డే సిరీస్ చేజిక్కించుకుని ఇప్పటికే ఆ జట్టుకి షాకిచ్చిన జింబాబ్వే ఏకైక టెస్టులో కూడా సత్తా చాటుతోంది.

TNN 14 Jul 2017, 8:11 pm
శ్రీలంకపై వన్డే సిరీస్ చేజిక్కించుకుని ఇప్పటికే ఆ జట్టుకి షాకిచ్చిన జింబాబ్వే ఏకైక టెస్టులో కూడా సత్తా చాటుతోంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం ఆరంభమైన ఏకైక టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలిరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టులో క్రైగ్ ఎర్విన్ (151 నాటౌట్: 238 బంతుల్లో 13x4, 1x6) ఒంటరి పోరాటంతో భారీ శతకం బాదేయగా.. సికిందర్ రజా (36), వాలెర్ (36) అతనికి చక్కటి సహకారం అందించారు.
Samayam Telugu zimbabwe tour of sri lanka 2017
శ్రీలంకకి మళ్లీ షాకిచ్చిన పసికూన..!


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేని ఆదిలోనే శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ఆత్మరక్షణలో పడేశాడు. ఓపెనర్లు మసకద్జ (19), చకబ్వా (12)లను జట్టు స్కోరు 38 లోపే హెరాత్ ఔట్ చేసేశాడు. అనంతరం తెరిసై (6), విలియమ్స్ (22) నిరాశపరిచినా.. క్రైగ్ ఎర్విన్ క్రీజులో పాతుకుపోయి జింబాబ్వే పరువు నిలిపాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఎర్విన్ చివరి వరకూ అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఎర్విన్‌‌తో పాటు క్రీజులో డొనాల్డ్ తిరిపానో (24 నాటౌట్) ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.