యాప్నగరం

ధోనీకి చిట్టి చేతులు సాయం.. వీడియో వైరల్

భారత సైన్యంపై ఉన్న అభిమానంతో వారు సాధారణంగా వినియోగించే నిసాన్ జోంగా వాహనాన్ని కొనుగోలు చేసిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. రాంచీలో ఆ వాహనంతో చక్కర్లు కొడుతున్నాడు.

Samayam Telugu 24 Oct 2019, 8:34 pm
బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి భారత్ జట్టు ప్రకటనభారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటూ ప్రస్తుతం పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నాడు. నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానుండగా ఈ సిరీస్‌ కోసం గురువారం జట్టుని ప్రకటించిన భారత సెలక్టర్లు.. ధోనీని ఎంపిక చేయలేదు. వాస్తవానికి ధోనీనే తాను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి అందుబాటులో ఉండనని బీసీసీఐకి ముందే చెప్పాడు. బంగ్లాతో సిరీస్‌కే కాదు.. డిసెంబరులో వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఈ మాజీ కెప్టెన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో.. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే సిరీస్‌‌లో మళ్లీ ధోనీ రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Samayam Telugu MS Dhoni


Read More: undefined
భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ.. తాను ఇటీవల కొనుగోలు చేసిన నిసాన్ జోంగాలో చక్కర్లు కొడుతున్నాడు. రాంచీ వేదికగా ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా మధ్య ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి ఈ వాహనంలోనే ధోనీ వచ్చిన విషయం తెలిసిందే. భారత్ ఆర్మీపై ఉన్న ప్రేమతో సైనికులు సాధారణంగా వినియోగించే నిసాన్ జోంగా వాహనాన్ని ధోనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీలోని పారాచ్యూట్ విభాగంలోప్రస్తుతం గౌరవ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. ఇటీవల కాశ్మీర్‌లో రెండు వారాల పాటు విధులు నిర్వర్తించాడు.

View this post on Instagram A little help always goes a long way specially when u realise it’s a big vehicle A post shared by M S Dhoni (@mahi7781) on Oct 24, 2019 at 3:02am PDT
ధోనీ తాజాగా తన నిసాన్ జోంగా వాహనాన్ని గ్యారేజీలో శుభ్రం చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అతని కూతురు జీవా అతనికి సాయం చేసింది. ఆ వీడియోని ధోనీ అభిమానులతో పంచుకోగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది.

Read More: undefinedబంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కోసం భారత సెలక్టర్లు ప్రకటించిన జట్టు ఇదే..!
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.