భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తండ్రయ్యాడు. అతని భార్య, భారత స్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఇద్దరు మగ కవల పిల్లలకి జన్మనిచ్చింది. ఈ శుభవార్తని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో దినేశ్ కార్తీక్ పంచుకున్నాడు. ఆ ఇద్దరి పిల్లల పేర్లని కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్గా పెట్టినట్లు కార్తీక్ దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్కి 2015లో వివాహం జరిగింది. అప్పటికే దినేశ్ కార్తీక్కి పెళ్లి జరగగా.. మొదటి భార్యకి విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత దీపికాతో పరిచయం కాస్తా.. పరిణయానికి దారితీసింది. పెద్దల్ని ఒప్పించి మరీ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో దినేశ్ కార్తీక్, దీపికా అప్పట్లో వివాహం చేసుకున్నారు.
ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్కి ఆడిన దినేశ్ కార్తీక్.. ఈ ఏడాది కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లకి కామెంటేటర్గా కూడా వ్యవహరించాడు. మరోవైపు దీపికా పల్లికల్.. స్కాష్ ప్లేయర్గా భారత్కి ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇంటర్నేషనల్ టోర్నీలలో సత్తాచాటుతోంది.
ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్కి ఆడిన దినేశ్ కార్తీక్.. ఈ ఏడాది కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లకి కామెంటేటర్గా కూడా వ్యవహరించాడు. మరోవైపు దీపికా పల్లికల్.. స్కాష్ ప్లేయర్గా భారత్కి ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇంటర్నేషనల్ టోర్నీలలో సత్తాచాటుతోంది.