టీ20 వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టుకి మెంటార్గా వ్యవహరించబోతున్న మహేంద్రసింగ్ ధోనీ.. టీమిండియా క్యాంప్లో చేరాడు. అక్టోబరు 24న దుబాయ్ వేదికగా మొదటి మ్యాచ్ని పాకిస్థాన్తో భారత్ జట్టు ఆడనుండగా.. సోమవారం నుంచి రెండు వార్మప్ మ్యాచ్లను టీమిండియా ఆడబోతోంది. ఈరోజు దుబాయ్ వేదికగా ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న భారత్.. బుధవారం ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా క్యాంప్తో చేరిన మహేంద్రసింగ్ ధోనీ.. కోచింగ్ స్టాఫ్తో కలిసి మొదట మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్కి బ్యాటింగ్కి సంబంధించి కొన్ని పాఠాలు చెప్తున్నట్లు కనిపించాడు. ధోనీ అలా చెప్తున్నంతసేపు హెడ్ కోచ్ రవిశాస్త్రి మౌనంగా చూస్తూ కనిపించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్లో.. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
టీమిండియాకి మెంటార్గా ఉండేందుకు ధోనీకి పెద్ద మొత్తంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫీజు ఆఫర్ చేసినా.. ధోనీ మాత్రం సున్నితంగా తిరస్కరించాడట. తాను ఉచితంగానే మెంటార్గా సేవలు అందిస్తానని ధోనీ చెప్పినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
టీమిండియాకి మెంటార్గా ఉండేందుకు ధోనీకి పెద్ద మొత్తంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫీజు ఆఫర్ చేసినా.. ధోనీ మాత్రం సున్నితంగా తిరస్కరించాడట. తాను ఉచితంగానే మెంటార్గా సేవలు అందిస్తానని ధోనీ చెప్పినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.