భారత్తో ఆదివారం టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో పాకిస్థాన్ తలపడనుండగా.. శనివారమే తుది జట్టుని దాయాది దేశం ప్రకటించేసింది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్కి పాక్ చోటివ్వడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వన్డే, టెస్టులకి గుడ్ బై చెప్పేసిన 39ఏళ్ల షోయబ్ మాలిక్.. కేవలం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. దానికి తోడు 2019 వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ జట్లు చివరిసారి తలపడగా.. ఆ మ్యాచ్లో మాలిక్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయినప్పటికీ.. మాలిక్కి చోటివ్వడం గమనార్హం. వాస్తవానికి భారత్తో మ్యాచ్కి తొలుత మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ని తీసుకుందామని పాక్ మేనేజ్మెంట్ భావించిందట. కానీ.. అతని కంటే స్పిన్ని బాగా ఆడగల షోయబ్ మాలిక్ని తుది జట్టులోకి తీసుకోవడం మంచిదని ఆఖరికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. షోయబ్ మాలిక్ ఎంపిక గురించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సుదీర్ఘంగా మాట్లాడాడు. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టుని పాకిస్థాన్ ఓడించిన విషయం తెలిసిందే.
‘‘సర్ఫరాజ్ అహ్మద్ స్పిన్లో బాగా ఆడగలడు. అలానే భారత్పై ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. కానీ.. మేము భారత్పై అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్నాం. స్పిన్ని షోయబ్ మాలిక్ ఫ్రంట్ ఫుట్పైకి వెళ్లి.. సమర్థంగా ఎదుర్కోగలడు. అందుకే సర్ఫరాజ్కి బదులుగా మాలిక్ని తుది జట్టులోకి తీసుకున్నాం. రాబోవు మ్యాచ్ల్లో సర్ఫరాజ్కి కూడా అవకాశాలిస్తాం’’ అని బాబర్ అజామ్ వెల్లడించాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
‘‘సర్ఫరాజ్ అహ్మద్ స్పిన్లో బాగా ఆడగలడు. అలానే భారత్పై ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. కానీ.. మేము భారత్పై అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్నాం. స్పిన్ని షోయబ్ మాలిక్ ఫ్రంట్ ఫుట్పైకి వెళ్లి.. సమర్థంగా ఎదుర్కోగలడు. అందుకే సర్ఫరాజ్కి బదులుగా మాలిక్ని తుది జట్టులోకి తీసుకున్నాం. రాబోవు మ్యాచ్ల్లో సర్ఫరాజ్కి కూడా అవకాశాలిస్తాం’’ అని బాబర్ అజామ్ వెల్లడించాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.