ఐపీఎల్ 2022 సీజన్ సరికొత్తగా ఉండబోతోంది. కొత్తగా టోర్నీలోకి రెండు జట్లు వస్తుండగా.. మొత్తం 10 జట్లతో వచ్చే ఏడాది ఐపీఎల్ జరగనుంది. ఈ మేరకు నవంబరులో ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించబోతోంది. అయితే.. పాత జట్లకి ఎంత మంది ఆటగాళ్లని అట్టిపెట్టుకునే వెసులుబాటు కల్పించనున్నారు? అలానే కొత్త జట్లు ఎంత మంది ఆటగాళ్లని వేలానికి ముందే తీసుకోవచ్చు? అనేదానిపై ఇంక్లా పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. ఐపీఎల్లోని పాత జట్లకి వేలానికి ముందే నలుగురు ఆటగాళ్లని అట్టిపెట్టుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లని అట్టిపెట్టుకోవచ్చు. ఇక కొత్త జట్లు వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లని.. ఇద్దరు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ని ఎంచుకోవచ్చు. అయితే.. వేలానికి వచ్చిన ఆటగాళ్లని ఎంచుకోవాలా..? లేదా జట్లు వదిలేసిన ఆటగాళ్ల లిస్ట్ నుంచి ఆ ముగ్గురినీ సెలెక్ట్ చేసుకోవచ్చా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు.
2018లో ఒక్కో జట్టుకి వేలంలోకి గరిష్ఠంగా రూ.80 కోట్లు ఖర్చు చేసే వెసులబాటు కల్పించగా.. ఈసారి ఆ మొత్తం రూ.90 కోట్లకి పెరిగే అవకాశం ఉంది. అయితే.. రిటైన్ కోసం ఈ రూ.90 కోట్లలో ఎంత ఖర్చు చేయాలి..? అనేదానిపై బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. 2018లో రిటైన్ చేసుకునే ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా రూ.33 కోట్లని ఫ్రాంఛైజీలు ఖర్చు చేశాయి. ఐపీఎల్లోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు రాబోతున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్పీఎస్జీ గ్రూప్ చేజిక్కించుకుంది.
2018లో ఒక్కో జట్టుకి వేలంలోకి గరిష్ఠంగా రూ.80 కోట్లు ఖర్చు చేసే వెసులబాటు కల్పించగా.. ఈసారి ఆ మొత్తం రూ.90 కోట్లకి పెరిగే అవకాశం ఉంది. అయితే.. రిటైన్ కోసం ఈ రూ.90 కోట్లలో ఎంత ఖర్చు చేయాలి..? అనేదానిపై బీసీసీఐ ఎటూ తేల్చడం లేదు. 2018లో రిటైన్ చేసుకునే ఆటగాళ్ల కోసం గరిష్ఠంగా రూ.33 కోట్లని ఫ్రాంఛైజీలు ఖర్చు చేశాయి. ఐపీఎల్లోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు రాబోతున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్పీఎస్జీ గ్రూప్ చేజిక్కించుకుంది.