రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2018 టోర్నీ ఫుట్బాల్ అభిమానుల్ని ఉత్కంఠ మ్యాచ్లతో ఆకట్టుకుంటోంది. గత వారం ఆరంభమైన ఈ టోర్నీ నాకౌట్ రేసులు బుధవారం నుంచి మొదలవగా.. ఉరుగ్వే, రష్యా, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. అయితే.. శుక్రవారం జరిగిన ఓ మ్యాచ్ అభిమానుల్ని తికమకకి గురిచేసింది. బ్రెజిల్, కోస్టారికా మధ్య ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్ల ఆటగాళ్లు తాము మాములుగా ధరించే జెర్సీల స్థానంలో వేరొక రంగులు జెర్సీలు ధరించి ఆడారు. ఈ మ్యాచ్లో బ్రెజిల్ 2-0 తేడాతో అలవోకగా గెలుపొందింది.
బ్రెజిల్ జట్టు సుదీర్ఘకాలంగా పసుపు రంగు జెర్సీలు ధరించి మ్యాచ్లు ఆడుతోంది. మరోవైపు కోస్టారికా ఎరుపు రంగు జెర్సీలతో మ్యాచ్లు ఆడుతోంది. కానీ.. అనూహ్యంగా ఈ రోజు రెండు జట్లూ.. తమ రంగుని మార్చుకున్నాయి. మ్యాచ్కి బ్రెజిల్ జట్టు నీలం రంగుతో రాగా.. కోస్టారికా ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలు ధరించి వచ్చారు. దీనిపై ఫిఫా మీడియా ప్రతినిధి మాట్లాడుతూ ‘రెండు జట్లూ గురువారం జరిగిన సమావేశంలో పరస్పర అంగీకారంతో ఈ మేరకు జెర్సీ రంగులు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి’ అని వెల్లడించాడు.
బ్రెజిల్ జట్టు సుదీర్ఘకాలంగా పసుపు రంగు జెర్సీలు ధరించి మ్యాచ్లు ఆడుతోంది. మరోవైపు కోస్టారికా ఎరుపు రంగు జెర్సీలతో మ్యాచ్లు ఆడుతోంది. కానీ.. అనూహ్యంగా ఈ రోజు రెండు జట్లూ.. తమ రంగుని మార్చుకున్నాయి. మ్యాచ్కి బ్రెజిల్ జట్టు నీలం రంగుతో రాగా.. కోస్టారికా ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలు ధరించి వచ్చారు. దీనిపై ఫిఫా మీడియా ప్రతినిధి మాట్లాడుతూ ‘రెండు జట్లూ గురువారం జరిగిన సమావేశంలో పరస్పర అంగీకారంతో ఈ మేరకు జెర్సీ రంగులు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి’ అని వెల్లడించాడు.