ఫిఫా ఫీవర్.. సెహ్వాగ్ ‘గోల్’ ట్వీట్ వైరల్
క్రీడా ప్రపంచం ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ ఫీవర్తో ఊగిపోతోంది. రష్యా వేదికగా గత నెలలో ఆరంభమైన ఈ మెగా టోర్నీ చివరి అంకానికి
Samayam Telugu 11 Jul 2018, 12:56 pm
క్రీడా ప్రపంచం ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ ఫీవర్తో ఊగిపోతోంది. రష్యా వేదికగా గత నెలలో ఆరంభమైన ఈ మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకోగా.. ఇప్పటికే ఫైనల్ బెర్తుని ఫ్రాన్స్ జట్టు ఖాయం చేసుకుంది. ఈరోజు రాత్రి ఇంగ్లాండ్, క్రొయేషియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్తో ఫైనల్లో ఫ్రాన్స్తో తలపడే జట్టు ఏదో తేలనుంది. ఆదివారం రాత్రి ఫైనల్తో ఈ టోర్నీ ముగియనుంది.
ఫిఫా ప్రపంచకప్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తికరంగా చర్చిస్తున్న ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఓ కిక్తో పెద్దాయన రోడ్డుపై నుంచి ఫుట్బాల్ను నేరుగా కిటికీలో నుంచి ఇంట్లోకి పడేలా గోల్ చేశాడు. ‘ఫ్రాన్స్, ఇంగ్లాండ్, క్రొయేషియా జట్లను మరిచిపోండి.. ఇతని ఆట చూడండి’ అని సెహ్వాట్ ట్వీట్ చేశాడు. పెద్దాయన ఫుట్బాల్ నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఫిఫా ప్రపంచకప్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తికరంగా చర్చిస్తున్న ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఓ కిక్తో పెద్దాయన రోడ్డుపై నుంచి ఫుట్బాల్ను నేరుగా కిటికీలో నుంచి ఇంట్లోకి పడేలా గోల్ చేశాడు. ‘ఫ్రాన్స్, ఇంగ్లాండ్, క్రొయేషియా జట్లను మరిచిపోండి.. ఇతని ఆట చూడండి’ అని సెహ్వాట్ ట్వీట్ చేశాడు. పెద్దాయన ఫుట్బాల్ నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.