ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో బోణి కొట్టిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది. బెంగాల్ వారియర్స్తో అహ్మదాబాద్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఆఖరి వరకూ పోరాడిన తెలుగు టైటాన్స్ మ్యాచ్ని 29-29తో టైగా ముగించాల్సి వచ్చింది. తాజా సీజన్లో తెలుగు టైటాన్స్కి ఇది రెండో టై మ్యాచ్కాగా.. బెంగాల్ వారియర్స్ ఇదే మొదటిది. మ్యాచ్లో సూరజ్ దేశాయ్ (7), సిద్ధార్థ దేశాయ్ (4) ఆరంభం నుంచి సత్తా చాటడంతో సగం టైమ్ ముగిసే సమయానికి 13-11తో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలో నిలిచింది. కానీ.. చివరి సగంలో ఆధిక్యాన్ని సమం చేస్తూ వచ్చిన బెంగాల్ వారియర్స్.. ఒకానొక దశలో తెలుగు టైటాన్స్పై 25-22తో పైచేయి సాధించింది.
మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో తెలుగు టైటాన్స్ 27-27తో పుంజుకోగా.. ఇక్కడ నుంచి ఆట ముగిసే వరకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లూ రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ.. డూ ఆర్ డై రోడ్ కోసం ఎదురుచూశాయి. దీంతో.. మ్యాచ్ ఆఖరికి టైగా ముగిసింది. స్కోర్లు సమంగా ఉండటంతో ఏ జట్టూ ప్రయోగాలకి వెళ్లి ప్రత్యర్థికి పాయింట్ను ఇచ్చేందుకు సాహసించలేదు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై 35-33 తేడాతో యూపీ యోధా విజయం సాధించింది.
మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో తెలుగు టైటాన్స్ 27-27తో పుంజుకోగా.. ఇక్కడ నుంచి ఆట ముగిసే వరకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రెండు జట్లూ రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ.. డూ ఆర్ డై రోడ్ కోసం ఎదురుచూశాయి. దీంతో.. మ్యాచ్ ఆఖరికి టైగా ముగిసింది. స్కోర్లు సమంగా ఉండటంతో ఏ జట్టూ ప్రయోగాలకి వెళ్లి ప్రత్యర్థికి పాయింట్ను ఇచ్చేందుకు సాహసించలేదు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై 35-33 తేడాతో యూపీ యోధా విజయం సాధించింది.