ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ పోరాటం బుధవారం ముగిసింది. గ్రేటర్ నోయిడా వేదికగా యూపీ యోధాతో ఈరోజు రాత్రి జరిగిన మ్యాచ్లో అసాధారణంగా పోరాడిన తెలుగు టైటాన్స్ 41-36 తేడాతో విజయాన్ని అందుకుంది. సీజన్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ ఈరోజు మ్యాచ్లోనూ 16 సార్లు రైడ్కి వెళ్లి 15 పాయింట్లు సాధించాడు. లీగ్ దశలో మొత్తం 22 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్ ఆరు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొంది.. ప్లేఆఫ్కి అర్హత సాధించలేకపోయింది. కబడ్డీ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ దేశాయ్.. తెలుగు టైటాన్స్ నుంచి చేజారిపోతున్న మ్యాచ్ని ఆఖర్లో అద్భుత ప్రదర్శనతో ఒడిసిపట్టాడు. యూపీ యోధ రైడర్ల దెబ్బకి రెండు సార్లు ఆలౌటైన తెలుగు టైటాన్స్.. ఆఖర్లో ఐదు నిమిషాల ఆట ముందు వరకూ వెనకబడే ఉంది. కానీ.. సూపర్ రైడ్తో ఆకట్టుకున్న సిద్ధార్థ.. వరుస పాయింట్లతో చెలరేగిపోయాడు. దీంతో.. ఒత్తిడికి గురైన యూపీ యోధా డిఫెన్స్లో తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. యూపీ యోధా జట్టులో రైడర్ శ్రీకాంత్ 8 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.
సీజన్లో 21వ మ్యాచ్ ఆడిన యూపీ యోధాకి ఇది ఏడో ఓటమికాగా.. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక చివరి మ్యాచ్ని శుక్రవారం బెంగళూరు బుల్స్తో యూపీ యోధా ఆడనుండగా.. ఈ మ్యాచ్తోనే టోర్నీ లీగ్ దశ మ్యాచ్లు కూడా ముగియనున్నాయి. ఆ తర్వాత సోమవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి.
సీజన్లో 21వ మ్యాచ్ ఆడిన యూపీ యోధాకి ఇది ఏడో ఓటమికాగా.. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక చివరి మ్యాచ్ని శుక్రవారం బెంగళూరు బుల్స్తో యూపీ యోధా ఆడనుండగా.. ఈ మ్యాచ్తోనే టోర్నీ లీగ్ దశ మ్యాచ్లు కూడా ముగియనున్నాయి. ఆ తర్వాత సోమవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్లు మొదలుకానున్నాయి.