యాప్నగరం

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళ

భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది.

TNN 18 Apr 2016, 9:27 am
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా పేరు సంపాదించింది. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగబోతున్న రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆమె అర్హత పొందింది. ఇంతవరకు ఒలింపిక్స్ లో జరిగిన జిమ్నాస్ట్ పోటీలలో భారత్ తరుపు మహిళలు అర్హత సాధించలేదు. దాంతో దీపా కొత్త చరిత్రను సృష్టించినట్టయింది. 22 ఏళ్ల దీపాది త్రిపుర. ఆమె ఇంతకు ముందు కూడా సంచలన విజయాలు అందుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ అందుకుంది. కామన్వెల్త్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో మెడల్ కొట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దీపానే. అలాగే గతేడాది నవంబర్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిఫ్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారత మహిళ కూడా దీపానే.
Samayam Telugu dipa karmakar becomes the first indian gymnast to qualify for an olympics
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళ

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.