యాప్నగరం

యోగేశ్వర్‌దత్‌కు కాంస్యం స్థానంలో రజతం

2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్‌దత్‌కు కాంస్యం స్థానంలో రజత పతకాన్ని అందించనున్నారు.

TNN 30 Aug 2016, 10:10 am
నాలుగేళ్ల క్రితం లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంస్యం స్థానంలో రజత పతకం యోగేశ్వర్‌ ఖాతాలో చేరనుంది. ఆ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ నెగ్గిన రష్యా రెజ్లర్ బెసిక్ కుదుకోవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. దీంతో అతడు పతకాన్ని కోల్పోనున్నాడు. ఫలితంగా యోగేశ్వర్‌దత్‌కు వెండి పతకం దక్కనుంది. 2013లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్లో కుదుకోవ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అంతకుముందు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతడికి డోప్ టెస్ట్ నిర్వహించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు ఈ టెస్టులో తేలింది. కుదుకోవ్‌తోపాటు మొత్తంగా మరో నలుగురు రెజర్లు డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. శాంపిల్స్ సేకరించిన నాటి 8 ఏళ్ల వరకు డోపింగ్ టెస్ట్ కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించే వీలుండగా, 2015లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆ గడువును మరో రెండేళ్లు పొడిగించింది. కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్‌కు రజత పతకం అందజేస్తారని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఈ విషయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Samayam Telugu four years after yogeshwar dutts bronze in olympics to turn silver
యోగేశ్వర్‌దత్‌కు కాంస్యం స్థానంలో రజతం

యోగేశ్వర్ రజత పతకం సాధిస్తే.. 2012 ఒలింపిక్స్‌లో భారత్ తరఫున సిల్వర్ మెడల్స్ సాధించిన ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరుతుంది. రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటు షూటింగ్ విభాగంలో విజయ్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.