యాప్నగరం

ఢిల్లీలో సాక్షి మాలిక్‌కు ఘన స్వాగతం

రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించి పెట్టిన సాక్షి మాలిక్ కు బుధవారం బ్రెజిల్ నుంచి ఢిల్లీకి చేరింది.

TNN 24 Aug 2016, 9:11 am
రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించి పెట్టిన సాక్షి మాలిక్ కు బుధవారం బ్రెజిల్ నుంచి ఢిల్లీకి చేరింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అధికారులు, అభిమానులు భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఘనస్వాగతం లభించడం పట్ల సాక్షి, ఆమె తండ్రి చాలా సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురికి ఈ స్థాయిలో స్వాగతం లభిస్తుందని అనుకోలేదన్నారు. సాక్షి మాట్లాడుతూ ఒలింపిక్ పతకం కోసం 12 ఏళ్లుగా కష్టపడుతున్నానని చెప్పారు. ఇది చాలా అద్భుతమైన అనుభవమని తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలో ఉన్న మొఖ్రాఖాస్ గ్రామంలోని తన ఇంటికి సాక్షి చేరుకున్నారు. ఆమెను చూసేందుకు గ్రామానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. అభినందనల వెల్లువ సాక్షిపై కురిసింది. నేడు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. ప్రకటించిన రెండున్నర కోట్ల రూపాయల నజరానాను కూడా అందివ్వనున్నారు.
Samayam Telugu grand welcome for rio bronze medalist sakshi malik
ఢిల్లీలో సాక్షి మాలిక్‌కు ఘన స్వాగతం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.