రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై సొంత ప్రజలే కుట్రపన్నారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన ఆరోపణలపై నర్సింగ్ యాదవ్ నాలుగేళ్ల పాటు క్రీడల నుండి బహిష్కరణకు గురయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ యాదవ్ దేశం తరఫున ఒలింపిక్స్ లో పాల్గొనడం ఇష్టంలేని స్వదేశీ ప్రత్యర్థులే ఈ కుట్రపన్నినట్లు ఐఓఎ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా చెప్పారు. దీనివల్ల ఒక క్రీడాకారుడు ప్రఖ్యాత ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోవడమే కాదు అంతర్జాతీయ క్రీడా యవనికపై భారతదేశానికి చెడ్డపేరు తీసుకువచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్ క్రీడా జీవితానికి మచ్చతెచ్చేందుకు కుట్రకు పాల్పడిన వారెవరనేది త్వరలోనే స్పష్టం కానుందన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు.
నర్సింగ్ను సొంతింటి వారే ఓడించారు
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై సొంత ప్రజలే కుట్రపన్నారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) వ్యాఖ్యానించింది.
TNN 20 Aug 2016, 4:29 pm