యాప్నగరం

అట్టహాసంగా రియో ముగింపు వేడుకలు

బ్రెజిల్ లోని రియో డి జనీరో ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన విశ్వక్రీడా సంబరాలు పూర్తయ్యాయి.

TNN 22 Aug 2016, 8:12 am
రియో ఒలింపిక్స్ ముగిశాయి. బ్రెజిల్ లోని రియో డి జనీరో ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగిన విశ్వక్రీడా సంబరాలు పూర్తయ్యాయి. రియో ఒలింపిక్స్ ముగింపు సందర్భంగా మారకానా స్టేడియంలో వివిధ రకాల ప్రదర్శనలు జరిగాయి. వివిధ దేశాల క్రీడాకారులు వారి జాతీయ జెండాను పట్టుకుని కవాతు నిర్వహించారు. నిర్వాహకులు కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కాల్చారు. ఆరంభ వేడుకలను ఇదే స్టేడియంలో ఎంత ఆడంబరంగా నిర్వహించారో, ముగింపు వేడుకలను కూడా అంతే అట్టహాసంగా నిర్వహించారు. కాగా ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారత పతాకధారిగా సాక్షి మాలిక్ వ్యవహరించింది. ఆమె భారత జాతీయ జెండాను పట్టుకుని కార్యక్రమంలో కవాతు చేసింది. పీవీ సింధు ఇప్పటికే భారత్ వచ్చేయడంతో సాక్షికి భారత పతాకాన్ని పట్టుకునే అవకాశం వచ్చింది. కాగా రియో ఒలింపిక్స్ 2016 పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని అమెరికా నిలబెట్టుకుంది. మొత్తం 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్యాలను అమెరికన్ అథ్లెట్లు సాధించారు. తరువాతి స్థానాల్లో బ్రిటన్, చైనాలు నిలిచాయి. భారత్ రెండు పతకాలతో 64వ స్థానంలో ఉంది.
Samayam Telugu rio olympics closing ceremony
అట్టహాసంగా రియో ముగింపు వేడుకలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.