యాప్నగరం

కొద్దిసేపటి కింద కుదిరిన గురి అప్పుడే తప్పింది

రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుందనే ఆనందంలో నుంచి తేలుకోకముందే మరో చేదు వార్త వచ్చింది.

TNN 8 Aug 2016, 2:10 am
రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ టీమ్ క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుందనే ఆనందంలో నుంచి తేలుకోకముందే మరో చేదు వార్త వచ్చింది. లక్ష్మీరాణి, బాంబేలా దేవి, దీపిక కుమారితో కూడిన ఇండియా టీమ్ కొలంబియాపై విజయం సాధించిన విషయం తెలిసందే. కాగా క్వార్టర్‌ ఫైనల్‌లో రష్యాపై ఈ టీమ్ తన శాయశక్తుల పోరాడినా చివరకు ఓడిపోయింది. ఫస్ట్ సెట్‌ను భారత్ కోల్పొయింది. అయితే రెండు, మూడు సెట్లలో మనోళ్లదే పైచేయి అయింది. కానీ ఫైనల్ గా ఉండే నాలుగో సెట్‌ లో రష్యా రెండు పాయింట్ల తేడాతో మనోళ్లపై విజయం సాధించింది. మొదటి సెట్ లో భారత్ - రష్యా 48-55 స్కోర్ చేయగా, రెండో రౌండ్ లో 53-52, మూడో సెట్ లో 53-50 చేశాయి. కాగా చివరి రౌండ్ లో 55-53 తో రష్యా విజేతగా నిలిచింది. ​ కానీ పోటీల్లో తాము గెలుస్తామనే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండగా ఇలా జరిగిందని దీపిక కుమారి అన్నారు. ఇదంతా బ్యాడ్ లక్ అన్నారు. కాగా లండన్ తో పోల్చుకుంటే ఇక్కడ వాతావరణం కూడా అంతగా బాగోలేదన్నారు. అలాగే తాను ప్రతి సెట్ లో 10 -10 స్కోర్ చేయడానికి ప్రయత్నించానన్నారు.
Samayam Telugu rio olympics indian women miss archery sfs by two points
కొద్దిసేపటి కింద కుదిరిన గురి అప్పుడే తప్పింది


WATCH: "Nahi laga to kya karoon?" Deepika Kumari after India's women's archery team exited the Rio Games #RioWithTOIhttps://t.co/A9gVcXfPt9 — TOI Sports News (@TOISportsNews) August 7, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.