ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ టెన్నిస్లో తనతో ఎవరు కలిసి ఆడాలనే విషయమై రోహన్ బోపన్న క్లారిటీ ఇచ్చాడు. త్వరలో జరగనున్న ఒలింపిక్స్ లో విశాఖ కుర్రాడు సాకేత్ మైనేనితో కలిసి ఒలింపిక్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బోపన్నతో కలిసి ఒలింపిక్స్ బరిలో దిగాలని భావించిన లియాండర్ పేస్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే సానియా మీర్జాతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ ఆడిన సాకేత్ పలు టోర్నీల్లో సత్తా చాటాడు. ఏటీపీ ర్యాంకింగ్స్లో టాప్-10లో ఉన్న డబుల్స్ పురుష ఆటగాళ్లు జోడిగా తమకు నచ్చిన ఆటగాడిని ఎంచుకునే వీలుంది. ఈ మధ్యే టాప్-10లోకి చేరిన రోహన్ బోపన్న తన భాగస్వామిగా సాకేత్ను ఎంపిక చేసుకున్నాడు. అయితే సెలక్షన్ కమిటీ నిర్ణయమే ఫైనల్ కానుంది.
ఒలింపిక్స్లో బోపన్న జోడిగా సాకేత్
ఒలింపిక్స్ ఎవరితో కలిసి ఆడాలనే విషయమై రోహన్ బోపన్న క్లారిటీ ఇచ్చాడు.
TNN 10 Jun 2016, 1:56 pm