యాప్నగరం

పీవీ సింధుకు సైకతశిల్పి కంగ్రాట్స్

రియో ఒలింపిక్స్ రజతపతక విజేత పీవీ సింధుకి తనదైన శైలిలో విషెస్ చెప్పాడు సైకతశిల్పి సురద్శన్ పట్నాయక్.

TNN 21 Aug 2016, 12:28 am
రియో ఒలింపిక్స్ రజతపతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి తనదైన శైలిలో విషెస్ చెప్పాడు ఒడిషా సైకతశిల్పి సురద్శన్ పట్నాయక్. కంగ్రాట్స్ పీవీ సింధు అంటూ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని నిర్మించాడు. అలాగే థాంక్స్ గురు గోపిచంద్ అంటూ మరో సైకత శిల్పాన్ని పట్నాయక్ రూపొందించాడు. రియో ఒలింపిక్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో ఫైనల్ మ్యాచ్ తన శక్తిమేరకు పోరాడినా పీవీ సింధుకు దేశనలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా సింధును అభినందించే ప్రయత్నం చేస్తున్నారు. 120 కోట్ల మంది భారతీయల ఆశను తీర్చావంటూ ఆమె కోసం పూజలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
Samayam Telugu sudarshan has made some very nice sculpture on sindhu and also paid tribute to gopichand
పీవీ సింధుకు సైకతశిల్పి కంగ్రాట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.