యాప్నగరం

కరోనా వైరస్‌తో భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి

కరోనా వైరస్‌తో రెండు వారాల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ రమేశ్ తికారామ్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 17 Jul 2020, 2:13 pm
కరోనా వైరస్‌తో భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ రమేశ్ తికారామ్ (51) బెంగళూరులో తాజాగా మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత పారా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ఎన్‌సీ సుధీర్ తెలియజేశాడు. రెండు వారాల క్రితం జ్వరం, దగ్గు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రమేశ్ తికారామ్ చేరగా.. పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తేలింది.
Samayam Telugu Ramesh Tikaram (Arjuna awardee)


ఆసుపత్రిలో చేరిన రోజుల వ్యవధిలోనే అతని శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌‌పై ఉంచి మరీ చికిత్స అందించారు. ఈ క్రమంలో గత వారం కోలుకున్నట్లు కనిపించిన రమేశ్ తికారామ్.. తాజాగా తుది శ్వాస విడిచినట్లు భారత పారా బ్యాడ్మింటన్ అసోషియేషన్ తెలిపింది. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

షాట్‌ఫుట్, జావెలిన్ త్రో‌ని తొలుత కెరీర్‌గా ఎంచుకున్న రమేశ్ తికారామ్.. 1995లో నాటింగామ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ మీట్‌లో పతకాలు గెలిచాడు. ఆ తర్వాత సిడ్నీలో‌ జరిగిన ఛాంపియన్‌షిప్‌లోనూ షాట్‌ఫుట్‌లో బంగారు పతకం గెలిచిన రమేశ్ తికారామ్.. అనంతరం బ్యాడ్మింటన్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాడు. షట్లర్‌గా అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన రమేశ్ తికారామ్‌కి 2002లో అర్జున అవార్డు లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.