ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నుంచి సైనా ఔట్.. కారణమిదే..
ప్రతిష్టాత్మక ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ నుంచి ఇండియా టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ తప్పుకుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో సతమతమయ్యానని, పీబీఎల్ టోర్నీ సమయంలో విశ్రాంతి తీసుకుంటానని ఆమె ట్వీట్ చేసింది.
Samayam Telugu 24 Nov 2019, 3:09 pm
ప్రధానాంశాలు:
- గాయంతో టోర్నీకి సైనా నెహ్వాల్ దూరం
- టోర్నీ సమయంలో విశ్రాంతి తీసుకుంటానని వెల్లడి
- అభిమానులకు సారీ చెప్పిన సైనా
- తర్వాతి సీజన్ ఆడతానని ఆశాభావం
వచ్చే జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ తప్పుకుంటున్నట్లు ఆదివారం తెలిపింది. ఈ ఏడాది కాలమంతా పాంక్రియాటిస్, గాయాలతో సైనా సతమతమైంది. ఈక్రమంలో పీబీఎల్ నుంచి తప్పుకుని ఆ సమయంలో విరామం తీసుంటానని ట్వీట్ చేసింది.
Read Also:ఇషాంత్ ప్రత్యేకమైన బౌలర్: పుజారా
’ అందరికీ హాయ్. వచ్చే పీబీఎల్ ఐదో సీజన్లో నేను ఆడడం లేదు. గాయాలతో ఈ ఏడాదంతా సతమతమయ్యాను. పీబీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకుని మెరుగ్గా సన్నద్ధమవుతాను. ఫ్యాన్స్ అందరికీ సారీ. తర్వాతి పీబీఎల్ సీజన్లో ఆడతాను‘ అని సైనా ట్వీట్ చేసింది. Read Also: ఏ ఫార్మాటైనా, బంతి కలరేదైనా కోహ్లీనే టాప్ : వాన్
ఈ ఏడాది చివరిసారిగా హాంకాంగ్ ఓపెన్లో ఆడిన సైనా.. ఆ టోర్నీలో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. నిజానికి ఈ ఏడాది గాయాలతో ఫామ్ కోల్పోయిన సైనా.. ఏకంగా ఐదు టోర్నీలలో తొలిరౌండ్లోనే నిష్క్రమించింది.
Read Also: ఎదురే లేని నాదల్
Read Also:ఇషాంత్ ప్రత్యేకమైన బౌలర్: పుజారా
’ అందరికీ హాయ్. వచ్చే పీబీఎల్ ఐదో సీజన్లో నేను ఆడడం లేదు. గాయాలతో ఈ ఏడాదంతా సతమతమయ్యాను. పీబీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకుని మెరుగ్గా సన్నద్ధమవుతాను. ఫ్యాన్స్ అందరికీ సారీ. తర్వాతి పీబీఎల్ సీజన్లో ఆడతాను‘ అని సైనా ట్వీట్ చేసింది.
ఈ ఏడాది చివరిసారిగా హాంకాంగ్ ఓపెన్లో ఆడిన సైనా.. ఆ టోర్నీలో తొలిరౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. నిజానికి ఈ ఏడాది గాయాలతో ఫామ్ కోల్పోయిన సైనా.. ఏకంగా ఐదు టోర్నీలలో తొలిరౌండ్లోనే నిష్క్రమించింది.
Read Also: ఎదురే లేని నాదల్