యాప్నగరం

Amit Panghal: బాక్సింగ్‌లో తొలి స్వర్ణం.. ఒలింపిక్స్ ఛాంపియన్‌ను మట్టి కరిపించిన అమిత్

ఈ ఏడాది ఆసియా క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో భారత్ తొలి స్వర్ణం సాధించింది. రియో ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన దుస్మటోవ్‌ను అమిత్ ఫైనల్లో ఓడించాడు.

Samayam Telugu 1 Sep 2018, 1:55 pm
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ పసిడి పతకం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత బాక్సర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. పురుషుల లైట్ ఫ్లై బాక్సింగ్ ఈవెంట్లో.. 49 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బాయ్ దుస్మటోవ్‌ను అమిత్ 3-2 తేడాతో ఓడించాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 14 బంగారు పతకాలు చేరాయి. ఫైనల్లో చక్కటి ఆట తీరు కనబర్చిన అమిత్.. రియో ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన దుస్మటోవ్‌ను ఓడించడం విశేషం.
Samayam Telugu Amit Panghal


ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన అమిత్.. తొలి రెండు రౌండ్లను ఖాతాలో వేసుకున్నాడు. దూకుడుగా ఆడే హసన్‌బాయ్‌ను అదే మంత్రంతో మట్టికరిపించాడు. అమిత్ చివర్లో కాస్త తడబడ్డాడు.. కానీ అప్పటికే మ్యాచ్ ఫలితం అతడి వైపు వైపు మొగ్గు చూపింది.

అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్లో పాలమ్‌పై అమిత్ 3-2 తేడాతో విజయం సాధించాడు. హర్యానాకు చెందిన అమిత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించాడు. గాయం కారణంగా సెమీస్ రేసు నుంచి తప్పుకున్న మరో బాక్సర్ వికాస్ కృష్ణన్ కాంస్యంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.