యాప్నగరం

‘అర్జున’ గ్రహీత సురేఖకి ఏపీ ప్రభుత్వం నజరానా..!

అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వీనమ్ జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా గురువారం

TNN 31 Aug 2017, 9:15 pm
అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వీనమ్ జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా గురువారం ప్రకటించింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులు మీదుగా గత మంగళవారం సురేఖ అర్జున అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో తనని కలిసిన సురేఖని అభినందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. కోటి నగదు పోత్సాహకం ప్రకటించారు. అంతేకాకుండా విజయవాడలో 500 చదరపు అడుగులు స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆమెకి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu andhra pradesh cm announces rs 1 crore to arjuna awardee archer surekha
‘అర్జున’ గ్రహీత సురేఖకి ఏపీ ప్రభుత్వం నజరానా..!


‘ఆంధ్రప్రదేశ్ తరఫున సురేఖ గర్వించదగిన స్థాయిలో సుమారు 70 మెడల్స్‌ని ఆర్చరీలో సాధించింది. దక్షిణాదిలో అత్యంత పిన్న వయసులో అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణి కూడా సురేఖనే’ అని చంద్రబాబు ప్రశంసించారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న సురేఖ.. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించాలనే తన లక్ష్యమని చంద్రబాబుతో వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.