యాప్నగరం

కబడ్డీ, టీటీలో భారత్‌కి పతకాలు ఖాయం..!

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కి మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. గేమ్స్‌లో 11వ రోజైన బుధవారం

Samayam Telugu 29 Aug 2018, 5:10 pm
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కి మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. గేమ్స్‌లో 11వ రోజైన బుధవారం టేబుల్ టెన్నిస్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడిన శరత్ కమల్, మణిక బాత్రా ఘన విజయంతో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. ఉత్తర కొరియా డబుల్స్ క్రీడాకారులతో ఈరోజు జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ జోడీ 3-2 తేడాతో గెలిచి భారత్‌కి పతకం ఖాయం చేసింది. అలానే బాక్సింగ్‌లోనూ వికాస్ కృష్ణ‌న్‌ భారత్‌కి పతకం ఖాయం చేశాడు. 75 కేజీల విభాగంలో పోటీపడిన వికాస్ కృష్ణ‌న్‌.. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా బాక్సర్ తంగ్లైతెన్‌ని 3-2 తేడాతో ఓడించి సెమీస్ చేరాడు.
Samayam Telugu 65593046


ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో భారత్ జట్టు ప్రస్తుతం 51 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 9 స్వర్ణ పతకాలు ఉండగా.. 19 రజతం, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ జాబితాలో చైనా 213 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశం ఇప్పటికే 100 పసిడి పతకాలను గెలుపొందడం విశేషం. చైనా తర్వాత.. జపాన్ ( మొత్తం 155 పతకాలు), దక్షిణ కొరియా (124), ఇండోనేషియా (87), ఇరాన్ (49) టాప్-5లో కొనసాగుతున్నాయి. బంగారు పతకాల సంఖ్య ఆధారంగా.. ఈ జాబితాని రూపొందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.