యాప్నగరం

గాయపడిన బాక్సర్ వికాస్‌ కృష్ణన్‌కి కాంస్యం..!

ఆసియా గేమ్స్‌లో చెదిరిన భారత బాక్సర్ వికాస్‌ కృష్ణన్‌ పసిడి కల. గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమణ.

Samayam Telugu 31 Aug 2018, 4:41 pm
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో గాయపడిన భారత బాక్సర్ వికాస్‌ కృష్ణన్‌‌ కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గేమ్స్‌లో 13వ రోజైన శుక్రవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకారం 75 కేజీల విభాగంలో కజకిస్థాన్‌కి చెందిన బాక్సర్ అమన్‌కుల్‌ అబిఖాన్‌తో సెమీఫైనల్స్‌లో వికాస్‌ కృష్ణన్‌‌ తలపడాల్సి ఉంది. కానీ.. ఫ్రీక్వార్టర్‌‌‌ఫైనల్లో చైనా బాక్సర్‌తో ఫైట్ చేస్తున్న సమయంలో వికాస్‌ కృష్ణన్‌ ఎడమ కంటి కనురెప్పకి తీవ్ర గాయమైంది. దీంతో.. గాయం తీవ్రత దృష్ట్యా టోర్నీ నుంచి వికాస్‌ కృష్ణన్‌ని తాజాగా తప్పించిన నిర్వాహకులు.. ఇప్పటికే సెమీస్ చేరి ఉండటంతో.. కాంస్య పతకాన్ని ప్రకటించారు. దీంతో.. కజిస్థాన్ బాక్సర్ ఫైట్ చేయకుండానే నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించాడు.
Samayam Telugu 65616133


భారీ అంచనాల మధ్య టోర్నీకి వెళ్లిన వికాస్‌ కృష్ణన్‌ ఆరంభం నుంచే జోరుని కొనసాగించాడు. కానీ.. గాయం అతడి ‘పసిడి’ కలని దూరం చేసింది. అయినప్పటికీ.. ఆసియా గేమ్స్‌లో వరుసగా మూడు సార్లు పతకం గెలిచిన తొలి భారత బాక్సర్‌గా వికాస్‌ కృష్ణన్‌ ‌నిలిచాడు. 2010 ఆసియా గేమ్స్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడిన వికాస్‌ కృష్ణన్‌ బంగారు పతకాన్ని గెలుపొందాడు. ఆ తర్వాత 2014లోనూ మిడిల్‌ వెయిట్‌లో పోటీపడి కాంస్యం గెలిచాడు.

భారత్‌కి ఈరోజు వికాస్‌ కృష్ణన్‌ కాంస్యంతో పాటు సాయిలర్స్‌లోనూ మూడు పతకాలు వచ్చాయి. దీంతో.. పతకాల సంఖ్య 64కి చేరగా.. ఇందులో 13 పసిడి, 22 రజత పతకాలతో పాటు 29 కాంస్యాలూ ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.