యాప్నగరం

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన శ్రీకాంత్

తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లోనూ కొనసాగుతోంది. ఐదు రోజుల కిందట ఇండోనేషియా ఓపెన్‌ను శ్రీకాంత్ గెలుపొందిన విషయం తెలిసిందే.

TNN 23 Jun 2017, 12:39 pm
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ హవా కొనసాగుతోంది. ఈ రోజు మరో భారత ఆటగాడు సాయి ప్రణీత్‌తో జరిగిన క్వార్టర్స్ పోరులో 25-23, 21- 17తో నెగ్గి సెమీస్‌లో ప్రవేశించాడు. దీంతో సింగ్‌పూర్ ఓపెన్ సిరీస్ ఫైనల్‌లో ఓటమికి శ్రీకాంత్ బదులుతీర్చుకున్నాడు. గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కొరియా షట్లర్ ప్రపంచ నెం.1 ఆటగాడు సాన్ వాన్ హో‌ను ఓడించిన శ్రీకాంత్ అయిదు రోజుల కిందట ఇండోనేసియా ఓపెన్‌లో అతడిపైనే గెలిచి టైటిల్ సాధించాడు. భారత్‌కు చెందిన ఏకంగా నలుగురు క్రీడాకారులు ఓ సూపర్ సిరీస్‌ క్వార్టర్స్‌కు చేరడం గమనార్హం.
Samayam Telugu australian open super series kidambi srikanth eases past b sai praneeth
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన శ్రీకాంత్


గురువారం జరిగిన పురుషుల, మహిళల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నేహ్వాల్‌లు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు సెమీస్ బెర్త్ కోసం ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, తై జు యింగ్‌తోనూ, సైనా చైనాకు చెందిన ఆరో సీడ్ సున్ యూతోనూ తలపడనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.