యాప్నగరం

పంచ్ పవర్‌కు విభూషణ్.. రాకెట్ మెరుపులకు భూషణ్

అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్న క్రీడాకారులకు తాజాగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాక్సర్ మేరీ కోమ్‌కు పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

Samayam Telugu 25 Jan 2020, 11:24 pm
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో మన రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డు దక్కింది. దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కావడం విశేషం. మరోవైపు మణిపూర్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్‌కు పద్మ్ విభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వీరిద్దరూ ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు.
Samayam Telugu Chennai: World Badminton Champion PV Sindhu during an event at a private school,...
PV Sindhu


Boxer Mary Kom


Read Also : IND vs NZL 2nd T20: భారత తుది జట్టిదే.. ఆ ప్లేయర్ ఔట్?
భారత బ్యాడ్మింటన్ రంగంలో తెలుగు తేజం సింధు ప్రత్యేకముద్ర వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరయిన సింధు కెరీర్‌లో ఎన్నో మరపురాని విజయాలున్నాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా సింధు నిలిచింది. సింధు ఖాతాలో మొత్తం 5 వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకాలున్నాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండేసి చొప్పున రజతాలు, కాంస్యాలు ఉన్నాయి. మరోవైపు నాలుగేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో తను రజత పతకం సాధించింది. బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. మరోవైపు 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు లభించింది.

Read Also : సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యిన చాహల్
వరల్డ్ బాక్సింగ్ రంగలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత బాక్సర్ మేరీ కోమ్ కావడం విశేషం. ఆమెకు ఈసారి ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌‌ను ప్రకటించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. 2006లో మేరీకి పద్మ శ్రీ ప్రకటించిన ప్రభుత్వం.. 2013లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. మరోవైపు తాజాగా కొంతమంది క్రీడాకారులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, హాకీ మాజీ ప్లేయర్ ఎంపీ గణేశ్, షూటర్ జీతూ రాయ్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఒయినామ్ బెంబెమ్ దేవి, విలువిద్య క్రీడాకారుడు తరుణ్‌దీప్ రాయ్ ఉన్నారు.

Read Also : undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.