యాప్నగరం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పీవీ సింధు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయణ్ని అభినందించారు.

Samayam Telugu 11 Jun 2019, 3:36 pm
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం (జూన్ 10) గ్రీన్‌లాండ్స్‌లోని హరిత ప్లాజా భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన కిషన్‌రెడ్డికి ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను పాల్గొన్న టోర్నీలు, సాధించిన విజయాల గురించి మంత్రికి వివరించారు.
Samayam Telugu Sindhu
పీవీ సింధు


కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.