యాప్నగరం

పీవీ సింధూకి అరుదైన గౌరవం.. BWF అంబాసిడర్‌గా నియమాకం

వరల్డ్‌ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌తో గత ఏడాది అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు.. తాజాగా బీడబ్ల్యూఎఫ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. తన మాటలతో యువ షట్లర్లలో సింధు ఇక స్ఫూర్తి నింపనుంది.

Samayam Telugu 23 Apr 2020, 9:05 am
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) తాజాగా పీవీ సింధూని అంబాసిడర్‌గా నియమించింది. ఆమెతో పాటు అగ్రశ్రేణి షట్లరు జాక్ సెఫర్డ్ (ఇంగ్లాండ్), చాన్ యుయోన్ (హాంకాంగ్), జెంగ్ వీ, హావాంగ్ కియాంగ్ (చైనా), నోబ్లాక్, జ్వీబ్లర్ (జర్మీన్) తదితర షట్లర్లు బీడబ్ల్యూఎఫ్ అంబాసిడర్‌లుగా ఎంపికయ్యారు.
Samayam Telugu Chennai: PV Sindhu in action againstPriyanshu Rajawat during during second day o...


Read More: కరోనా వైరస్‌ కట్టడికి సింధు స్పెషల్ వీడియో
బీడబ్ల్యూఎఫ్ అంబాసిడర్‌లు యువ షట్లర్లలో స్ఫూర్తి నింపుతూ ‘‘ఐ యామ్ బ్యాడ్మింటన్’’ ద్వారా వారికి అవగాహన కల్పిస్తుంటారు. బీడబ్ల్యూఎఫ్ అంబాసిడర్‌గా ఎంపికడంపై పీవీ సింధు మాట్లాడుతూ ‘‘స్పోర్స్‌ని మీ కోసం మీరు ఆడుతున్నారు. కాబట్టి.. దాన్ని మీరు బాగా ఆస్వాదించాలి. అలానే ప్రతి షట్లర్ గేమ్‌ని నిజాయతీ, అంకితభావంతో ఆడాలి. బ్యాడ్మింటన్‌పై తమకి ఉన్న ఇష్టాన్ని తెలియజేయడానికి ఐ యామ్ బ్యాడ్మింటన్ మంచి ప్లాట్‌ఫామ్’’ అని వెల్లడించింది.

2019లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచిన పీవీ సింధు.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది. కానీ.. ఆ టోర్నీ తర్వాత కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఈ తెలుగు షట్లర్.. ఈ ఏడాది జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌పై ఆశలు పెట్టుకుంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.