యాప్నగరం

Saina Nehwal బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో శుభారంభం

BWF World Championships లో సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌కి అర్హత సాధించింది. గాయాల కారణంగా గత ఏడాది నుంచి ప్రధాన టోర్నీలకి దూరమవుతూ వచ్చిన సైనా ఈరోజు కేవలం 38 నిమిషాల్లోనే..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 23 Aug 2022, 12:38 pm

ప్రధానాంశాలు:

  • బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ సైనా శుభారంభం
  • ఈరోజు ఫస్ట్ రౌండ్‌లో చెయుంగ్‌పై అలవోక గెలుపు
  • 38 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Saina Nehwal (Pic Credit: BAI)
సైనా నెహ్వాల్ (Pic Credit: BAI)
జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసింది. ఉమెన్స్ సింగిల్స్‌లో భాగంగా ఈరోజు హాంకాంగ్‌కి చెందిన చెయుంగ్ గాన్‌‌తో ఫస్ట్ రౌండ్‌లో పోటీపడిన సైనా నెహ్వాల్ 21-19, 21-9 తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ని కేవలం 38 నిమిషాల్లోనే సైనా నెహ్వాల్ ముగించేయడం గమనార్హం.
వాస్తవానికి గాయాల కారణంగా సైనా నెహ్వాల్ కెరీర్ ఇటీవల గాడితప్పింది. గత ఏడాది ఒలింపిక్స్‌కి గాయం కారణంగా దూరంగా ఉండిపోయిన సైనా నెహ్వాల్ ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌కి కూడా గాయంతో దూరమైంది. అలానే సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌తో సరిపెట్టింది. దాంతో ఈ లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత కెరీర్ ఇక ముగిసిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ.. ఇటీవల గాయం నుంచి కోలుకున్న సైనా నెహ్వాల్ తన భర్త, షట్లర్ పారుపల్లి కశ్యప్ పర్యవేక్షణలో మళ్లీ ఫామ్ అందుకుంది. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ సైనా నెహ్వాల్ వెంట కశ్యప్ ఉన్నాడు.

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పుడు ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ మాత్రమే మిగిలింది. మాళవిక ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటిబాట పట్టగా.. పీవీ సింధు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు ఉమెన్స్ సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.