దుబాయ్: బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో తెలుగు తేజం పీవీ సింధు జపాన్కు చెందిన అకనే యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. వరల్డ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న సిందు.. రెండో ర్యాంకులో కొనసాగుతున్న యమగుచిపై 21-9, 21-13 తేడాతో గెలుపొందింది. గ్రూప్-ఏ మహిళల సింగిల్స్లో ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన సింధు 36 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించింది.
ఈ విజయంతో సింధు గ్రూప్ దశను ఓటమి లేకుండానే ముగించింది. మూడు విజయాలతో సింధు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలవగా.. యమగూచి రెండో స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రం జరగనున్న సెమీస్లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. మరో సెమీస్లో యమగూచి థాయిలాండ్కు చెందిన రచనోక్తో పోటీ పడనుంది.
పురుషుల సింగిల్స్లో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మూడో ఓటమిని చవి చూశాడు. గ్రూప్-బి మ్యాచ్లో 17-21, 21-19, 14-21 తేడాతో చైనాకు చెందిన షి యుఖి చేతిలో చివరి గ్రూప్ మ్యాచ్లోనూ ఓడాడు.
ఈ విజయంతో సింధు గ్రూప్ దశను ఓటమి లేకుండానే ముగించింది. మూడు విజయాలతో సింధు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలవగా.. యమగూచి రెండో స్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రం జరగనున్న సెమీస్లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యుఫీతో తలపడనుంది. మరో సెమీస్లో యమగూచి థాయిలాండ్కు చెందిన రచనోక్తో పోటీ పడనుంది.
పురుషుల సింగిల్స్లో తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మూడో ఓటమిని చవి చూశాడు. గ్రూప్-బి మ్యాచ్లో 17-21, 21-19, 14-21 తేడాతో చైనాకు చెందిన షి యుఖి చేతిలో చివరి గ్రూప్ మ్యాచ్లోనూ ఓడాడు.