యాప్నగరం

చైనా ఓపెన్: తొలి రౌండ్లోనే ముగిసిన సైనా పోరాటం

చైనా ఓపెన్ నెగ్గిన తొలి ఇండియన్‌గా రికార్డ్ నెలకొల్పిన సైనా నెహ్వాల్ ఈసారి మాత్రం తొలి రౌండ్లోనే ఓటమిపాలై నిరాశపర్చింది.

Samayam Telugu 18 Sep 2018, 2:09 pm
చైనా ఓపెన్‌లో పీవీ సింధు ప్రి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా.. సైనా నెహ్వాల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2016లో చైనా ఓపెన్ టైటిల్ గెలిచిన మూడో సీడ్ సింధు.. జపాన్‌కు చెందిన సయేనా కవకమి‌ని 21-15, 21-13 తేడాతో తొలి రౌండ్లో ఓడించింది. వరుస గేముల్లో గెలుపొందిన సింధు తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఓటమిపాలై నిరాశపర్చింది.
Samayam Telugu saina.


కొరియాకు చెందిన సంగ్ జి హ్యూన్ చేతుల్లో 22-20, 8-21, 14-21 తేడాతో పరాజయం పాలైంది. 2014లో చైనా ఓపెన్ గెలిచిన సైనా.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డ్ నెలకొల్పింది.

పురుషుల డబుల్స్‌లో నేషనల్ ఛాంపియన్స్‌గా నిలిచిన మను అట్టారీ, బి.సుమీత్ రెడ్డి ద్వయం.. చైనీస్ తైపీకి చెందిన లియావో మిన్ చున్, సు చింగ్ హెంగ్‌పై 13-21, 21-13, 21-12 తేడాతో విజయం సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.