యాప్నగరం

తెలుగు ప్రభుత్వాలకు సింధు ఆర్థిక సాయం

క‌రోనా వైర‌స్‌పై పోరాటం సాగించేందుకుగాను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ముందుకొచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని తాజాగా ప్రకటించండి.

Samayam Telugu 26 Mar 2020, 2:39 pm
క‌రోనా వైర‌స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్త‌రిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా ఈ వైర‌స్ బారిన‌ పడ్డారు. దాదాపు 21 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక మన దేశ విషయానికొస్తే ఇండియావ్యాప్తంగా 600 మందికిపైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు 13 మంది తన ప్రాణాలను కోల్పోయారు. అయితే క‌రోనాపై పోరాటానికి ప్రభుత్వానికి ఈ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు షట్లర్ పి.వి.సింధు తెలుగు ప్రభుత్వాలకు 5 లక్షల రూపాయ‌ల‌ చొప్పున సాయం ప్ర‌క‌టించింది.
Samayam Telugu Chennai: World Badminton Champion PV Sindhu during an event at a private school,...
PV Sindhu


Read Also: షాక్.. రోహిత్ (264*) వ‌న్డేల్లో హైయెస్ట్ స్కోరు కాదా!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు ఈ నిధులను విరాళంగా ఇస్తున్నట్లు సింధు ట్వీట్ చేసింది. క‌రోనాపై పోరాటానికి ఈ నిధుల‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. మరోవైపు బిసిసిఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని పేదలను పంచేందుకు ముందుకొచ్చిన‌ సంగతి తెలిసిందే. అలాగే సినీ హీరో నితిన్ కూడా 10 లక్షల రూపాయల చొప్పున తెలుగు ప్రభుత్వాలకు సాయం ప్రకటించిన సంగతి విదితమే.

Read Also: ఆసియాకప్ నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం!

మరోవైపు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు.. బ్యాడ్మింటన్ మ‌హిళ‌ల సింగిల్స్‌ విభాగంలో రజత పతకం సాధించింది. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ కోసం తాను సన్నద్ధమైంది. అయితే కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాదికి ఈ టోర్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచ క్రీడారంగంలోని అన్ని టోర్నీలు ఈ వైరస్ ప్రభావానికి గురి అయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు క్రికెటర్లు, క్రీడాకారులు ఇంటివద్దే గ‌డుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.