యాప్నగరం

కరోనా ఎఫెక్ట్‌తో వింబుల్డన్ టోర్నీ రద్దు

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ టోర్నీ రద్దవడం చరిత్రలో ఇదే తొలిసారి. గత మూడు వారాలుగా వేచి చూసే ధోరణిలో వ్యవహరించిన టోర్నీ నిర్వాహకులు ఆఖరికి వెనక్కి తగ్గక తప్పలేదు.

Samayam Telugu 1 Apr 2020, 9:30 pm
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ రద్దయింది. ఇప్పటికే జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదాపడగా.. సుదీర్ఘ చర్చల తర్వాత ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్‌టీసీ) ఈ గ్రాండ్‌స్లామ్‌ని రద్దు చేస్తూ ఈరోజు నిర్ణయం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ టోర్నీ రద్దవడం ఇదే తొలిసారి.
Samayam Telugu FILE PHOTO: A Wimbledon logo is seen inside the grounds at the Wimbledon tennis championships in London


Read More: ఒలింపిక్స్ స్వర్ణం నా కల: బాక్సర్ మేరీకోమ్

ఈ ఏడాది జూన్ 29 నుంచి జులై 12 వరకూ వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ.. వారం వ్యవధిలో కరోనా వైరస్ కేసులు పతాక స్థాయికి చేరుకోగా.. బ్రిటన్‌లో బాధితుల సంఖ్య చైనాని మించిపోయింది. ఈ నేపథ్యంలో టోర్నీని రద్దు చేయడమే ఉత్తమమని ఏఈఎల్‌టీసీ భావించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అన్ని క్రీడా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడుతున్నా.. వేచి చూసే ధోరణిలో ఇన్ని రోజులూ వ్యవహరించిన ఏఈఎల్‌టీసీ.. ఒకానొక దశలో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా టోర్నీని నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. కానీ.. ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.

Read More: ఐపీఎల్ వాయిదాతో CSK నష్టం రూ. 200 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం రాత్రికి 8,86,346కి చేరుకోగా.. ఇందులో ఒక్క ఇటలీ నుంచే నమోదైన కేసులు 1,05,792. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మే నెల చివరి వరకూ ఎలాంటి క్రికెట్ టోర్నీలు నిర్వహించబోమని ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.