యాప్నగరం

లాక్‌డౌన్‌తో నూతన స్పోర్ట్స్ స్టార్స్ వెలుగులోకి...

దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, క్రికెటర్ సురేష్ రైనా పలు సూచనలు చేశారు. ఈ కాలంలో ప్రజలతో ఇళ్లలోనే గడపాలని సూచించారు.

Samayam Telugu 25 Mar 2020, 11:24 pm
కరోనా వైరస్ అదుపు చేయడం కోసం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశాన్ని లాక్‌డౌన్‌ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తాజాగా దీనిపై కేంద్ర మాజీ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సీనియర్ క్రికెటర్ సురేష్ రైనాతో చాట్ చేశారు. లాక్ డౌన్ వల్ల దేశ క్రీడా రంగానికి మరింత మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. ప‌లువురు నూత‌న స్పోర్ట్స్ స్టార్లు వెలుగులోకి రానున్నారని రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రైనా ఇటీవలే మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైనాకు రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu Suresh-Raina-Rajyavardhan-Singh-Rathore
Rajyavardhan Singh Rathore-Suresh Raina


Read Also: బంతితో మాయ..IPL బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే!

లాక్ డౌన్ సంద‌ర్భంగా రాథోడ్ గ‌తంలో ఒక సంఘ‌ట‌న‌ను పంచుకున్నారు. అప్పట్లో తాము డ్రై ప్రాక్టీస్ చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. చేతిలో గన్‌ లేకపోయినప్పటికీ కూడా గన్‌ ఉన్నట్టు ఊహించుకుని ప్రాక్టీస్ చేయడాన్ని డ్రై ప్రాక్టీస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రస్తుత లాక్ డౌన్‌ పరిస్థితుల్లో ల‌భించిన విరామంతో ఎంతోమంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: గంగూలీ మంచి మ‌న‌సు.. పేద‌ల‌కు భారీ సాయం

ఇక లాక్ డౌన్‌ కాలంలో ప్రజలంతా ఇళ్లలోనే గడపాలని రాథోడ్‌, రైనా సూచించారు. అప్పుడే క‌రోనా వైరస్ ఇతరులకు వ్యాపించకుండా, దాన్ని అరికట్టే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు. మరోవైపు క‌రోనా వైర‌స్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. 17 వేల మందికి పైగా మరణించినట్లు సమాచారం. భారతదేశంలో ఆరువందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. 11 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.