యాప్నగరం

సైనా ఎట్టకేలకు ఆ గండాన్ని దాటేసింది!

సైనా నెహ్వాల్ ఎట్టకేలకు నాలుగేళ్ల తనను వెంటాడుతున్న బలహీనతను అధిగమించింది. డెన్మార్క్ ఓపెన్లో జపాన్ ప్లేయర్ అకానే యమగుచిని ఓడించింది.

Samayam Telugu 19 Oct 2018, 9:00 am
డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్ జపాన్‌ ప్లేయర్ అకానే యమగుచిని ఓడించింది. 21-15, 21-17 తేడాతో యమగుచిపై విజయం సాధించిన సైనా.. క్వార్టర్ ఫైనల్‌ చేరింది. గత నాలుగేళ్లలో సైనా యమగుచిని ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా 2014 చైనా ఓపెన్‌లో సైనా ఈ జపాన్ ప్లేయర్‌ను ఓడించింది. డెన్మార్క్ ఓపెన్‌కు ముందు జపనీస్ షట్లర్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో సైనాపై గెలుపొందింది. ఇటీవల ప్రధాన టోర్నీల్లో తడబడుతోన్న సైనా.. యమగుచిపై గెలవడం ఆనందాన్నిచ్చిందని తెలిపింది.
Samayam Telugu saina1


‘ఇవాళ నేను స్మార్ట్‌గా ఆడాను. యమగుచి చాలా ట్రికీ షాట్లను ఆడింది. కానీ వాటిని నేను దీటుగా ఎదుర్కొన్నాన’ని గురువారం మ్యాచ్ ముగిసిన అనంతరం సైనా తెలిపింది. శుక్రవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మరో జపనీస్ నోజోమి ఒకుహరతో తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.